సముద్రాల రాఘవాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
'''సముద్రాల రాఘవాచార్య''' ('''Samudrala Raghavacharya''') ([[జూలై 19]], [[1902]] - [[మార్చి 16]], [[1968]]) [[తెలుగు సినిమా]] పరిశ్రమలో '''సముద్రాల సీనియర్''' గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు [[సముద్రాల రామానుజాచార్య]] సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
==జీవిత విశేషాలు==
సముద్రాల వేంకట రాఘవాచార్య [[గుంటూరు జిల్లా]], [[రేపల్లె]] సమీపంలోని [[పెదపులివర్రు]] గ్రామంలో [[1902]], [[జూలై 19]]వ తేదీన పండితవంశంలో జన్మించాడు. ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించాడు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టాడు. ఇతని అవధాన ప్రావిణ్యాన్ని గురించి విన్న [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి]] ఇతడిని తన కుమారునికి తెలుగు నేర్పవలసినదిగా కోరాడు. అతని అభ్యర్థనను మన్నించిన సముద్రాల తన మకామును గుంటూరుకు మార్చాడు. అక్కడ ఇతనికి [[కొసరాజు రాఘవయ్య చౌదరి]], [[గూడవల్లి రామబ్రహ్మం]]లతో స్నేహం ఏర్పడింది. [[కట్టమంచి రామలింగారెడ్డి]] రెడ్ల చరిత్రపై పరిశోధన చేస్తున్నట్టు తెలుసుకున్న కుప్పుస్వామి చౌదరి ఇతడిని, కొసరాజును, గూడవల్లిని మద్రాసు వెళ్లి కమ్మ చరిత్రపై పరిశోధనలు చేయవలసినదిగా ఆదేశించాడు. మద్రాసులో ఇతడు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో కమ్మచరిత్రపై పరిశోధన చేస్తూ, [[సమదర్శిని]] పత్రికలో కూడా పనిచేశాడు. సమదర్శిని కారణాంతరాల వల్ల నిలిచిపోగా ఇతడు మళ్ళీ గుంటూరుకు చేరాడు. కృష్ణాజిల్లా ప్రజామిత్ర పక్షం వారు విజయవాడలో ప్రారంభించిన [[ప్రజామిత్ర]] పత్రికను మద్రాసుకు తరలించి దానికి సంపాదకుడిగా గూడవల్లిని నియమించారు. గూడవల్లి అభ్యర్థన మేరకు ఇతడు తిరిగి మద్రాసు చేరి ప్రజామిత్రలో సహాయ సంపాదకునిగా చేరాడు.
 
==తెలుగు చిత్ర పరిశ్రమ==