శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
లింకులు |
|||
పంక్తి 10:
}}
'''శోభారాజు''' ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. [[అన్నమయ్య]] సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది.<ref>{{cite news |title=Metro cultural round-up |url=http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |newspaper=[[The Hindu]] |date=14 June 2004 }}</ref> స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది.
2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డుతో సత్కరించింది.<ref name=pib1>{{cite press release |title=This Year's Padma Awards announced |url=http://www.pib.nic.in/release/release.asp?relid=57307 |publisher=[[Ministry of Home Affairs (India)|Ministry of Home Affairs]] |date=25 January 2010 |accessdate=17 July 2010}}</ref>
1983 లో ''అన్నమాచార్య భావనా వాహిని'' అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు
== బాల్యం, విద్యాభ్యాసం ==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా [[వయొలిన్]] వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు [[హరికథ|హరికథకులు]] కూడా.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016}}</ref> నాలుగేళ్ళ వయసునుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించింది. తండ్రి చిత్తూరులో
ఆధునిక విద్యనభ్యసిస్తూనే సంగీతం సాధన చేసింది.
==అన్నమయ్య సంకీర్తనలు==
ఆమె చిన్నప్పటి నుంచి అన్నమాచార్య వేదికలమీద అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేది. పాఠశాల స్థాయిలోనే అనేక పురస్కారాలు అందుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు [[పెండ్యాల నాగేశ్వరరావు|పెండ్యాల]], [[సాలూరు రాజేశ్వరరావు|సాలూరి రాజేశ్వర రావు]], [[రమేష్ నాయుడు]], [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] తదితరుల చేతుల మీదుగా అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. ఎస్. రాజేశ్వరరావు ఆమెను చెన్నైకు ఆహ్వానించి రెండు పాటలను కూడా రికార్డు చేశాడు. [[కామిశెట్టి శ్రీనివాసులు]] ఆమెకు అన్నమాచార్య కీర్తనలకు మార్గం సూచించారు. ఆమెకు శిక్షణ ఇచ్చారు. 1976లో అన్నమయ్య పాటలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పనిచేసి, హైదరాబాదు నగరంలో [[అన్నమయ్యపురం]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అన్నమాచార్య ప్రాజెక్టు తర్వాత 1982 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రామదాసు ప్రాజెక్టులో పనిచేసింది.
1983లో అన్నమాచార్య భావనా వాహిని అనే పేరుతో స్వంతంగా ప్రాజెక్టు ప్రారంభించింది. అన్నమయ్య వర్ధంతితో పాటు జయంతి, నగర సంకీర్తనం, సంగీత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా వేలాది మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. సంగీతంలో జబ్బులు నయం అవుతాయని [[నిమ్స్ ఆసుపత్రి]] యాజమాన్యంతో కలిసి ప్రయోగాత్మకంగా నిరూపించింది. మనుషుల్లో మానసిక పరివర్తన కోసం కూడా సంగీతం ఉపయోగపడుతుందని జైళ్ళకు వెళ్ళి సంకీర్తనలు గానం చేశారు.
== సంగీత శిక్షణ ==
హైదరాబాదులో హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అన్నమయ్యపురం ని తీర్చిదిద్దింది. ఇక్కడ నిరంతరం వేంకటేశ్వర నామ సంకీర్తనం, సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య తత్వ ప్రచారం, ఆయన కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే ఆవరణలో అన్నమాచార్య సమేత శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ గోపురంపై [[రామదాసు]], [[త్యాగరాజు|త్యాగయ్య]] వంటి వాగ్గేయకారుల విగ్రహాలను కూడా చెక్కారు. ప్రముఖ సినీ గాయకుడు మరియు, నటుడు [[సాందీప్]] శోభారాజు శిష్యుడు.
== పురస్కారాలు, పదవులు ==
2010లో కళారంగంలో ఆమె కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ పురస్కారాన్ని]] అందజేసింది. [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నుంచి గౌరవ డాక్టరేటు పొందింది.
==మూలాలు ==
|