దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి /* ఉప్పు సత్యాగ్రహం మరియు సహాయనిరాకరణోద్యమము మొదలగు స్వాతంత్ర్య పోరట ఉద్యమాలలో శివరావుగారి ప... |
||
పంక్తి 118:
==ఉప్పు సత్యాగ్రహం మరియు సహాయనిరాకరణోద్యమము మొదలగు స్వాతంత్ర్య పోరట ఉద్యమాలలో శివరావుగారి పాత్ర, వారి కృషి==
1930 నుంచీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో స్వతంత్రపోరాటోద్యమాలలో జరిగిన అనేక సంఘటనలు, ప్రముఖుల కార్యకాలపాలు శివరావు గారు తమ డయరీలో వ్రస్తూ 1930 సంవత్సర జనవరీ మొట్టమొదటి అంశం తమ డైరీలో ఇట్లా వ్రాశారు “I was restless with the civil disobedience movement that was in the offing after declaration of Independence in Lahore Congress.” పశ్చమ కృష్ణా జిల్లాకాంగ్రెస్సు మహా సంఘము అనేక చిన్న చిన్న పుస్తకములను కాంగ్రెస్సు కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానము అను పేరుతో ప్రచురించారు. అందులో శివరావుగారు వ్రాసిన చిన్న పుస్తకములు కూడా ఆరు పుస్తకములు ప్రచురించారు. మొట్టమొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12-03-1930 లో ఆంధ్ర గ్రంథాలయం లోముద్రించబడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 06-04-1930 లో ముద్రించబడింది. ఆ తరువాత ఇంకో నాలుగు దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము అను నాలుగు పుస్తకములు కృష్ణా జిల్లా కాంగ్రెస్సు వారి ద్వారా ప్రచురించ బడినవి. ఈ రాజకీయపరిజ్ఞానము అను కృష్ణాజిల్లా కాంగ్రెసేవారి ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు నవంబరు 1933 లో నిషేధించారు. 1930 నుంచీ కాంగ్రెస్సుకార్యకలాప్పాలలో శివరావుగారు ఈవిధంగా వెనుకనిలబడి పనిచేశారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్సు పబ్లిసిటీ సమితికి శివరావుగారి అధ్యక్షతన జరిగేది. ఏ రాజనీతి పరిజ్ఞాన కర పత్రంమైనా, కాంగ్రెస్ నాయకుల వ్రాతప్రతుల తర్జుమా లైనా శివరావు గారి కలంతో జరిగేది. 11/04/1930 తారీఖునాడు ఉప్పుసత్యాగ్రాహికుల మొదటి విడతగా గంపలగూడెం కుమార రాజాగారి అధ్యక్షతన బెజవాడనుండి బందరు దగ్గరు చిన్నపురానికి బయలుదేరారు. వారితోపాటు డా ఘంటసాల సీతారామశర్మగారు కూడానున్నారు. 4/04/1930 తారీఖునాడు డా. వెలిదండ్ల హనుమంతరావుగారి అధ్యక్షతన రెండవవిడత బెజవాడనుండి పాదగమనంతో రైల్వేస్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి రైలులో మచలీపట్ణానికి వెళ్లారు. అక్కడ రాత్రి డా. పట్టాభిసీతారామయ్యగారింట బస చేసి మర్నాడు ప్రొద్దున్న ముగ్గురు డాక్టర్లూ ( హనుమంతరావుగారు, సీతారామయ్యగారు, శర్మగారు) కలసి 15-04-1930 తారీఖున బందరు దగ్గర చిన్నపురం చేరుకున్నారు. మొదటగా బయలుదేరిన కుమార రాజాగారు చిన్నపురంలో చేసిన ఉప్పు జమచేసుకుని బందరు పట్టుకుచ్చి బందరు బజారులలో అమ్మకం చేశారు. సత్యాగ్రహ సమర ఉగ్రతంగా జరిగే రోజల్లో శివరావు గారు వ్రాసిన అనేక కర పత్రములు పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్సుకమిటీ వారి ప్రచురణల క్రింద కాంగెస్సు కార్యకర్తలకు బోధనానుకూలముగా ముద్రించబడేవి. వారు వ్రాసిన “భారతీయుల దారిద్య్రము” అను వ్యాసము సహకారము అనే పత్రికలో ను, 10/03/1930 తారీఖున వారి పుస్తకము “సత్యాగ్రహ చరిత్ర” ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్ లో ముద్రించబడింది. ఈపుస్తక ఆవిష్కరణం పడమర కృష్ణాజిల్లా వారి రణభేరీతో “శుక్ల సంవత్సరము ఫాల్గుణ శు బుధవారము నాడు సత్యాగ్రహ సమర సుభముహూర్తమున దిగవల్లి వేంకట శివరావు రచించిన సత్యాగ్రహ చరిత్ర డా//ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య, మంచాల సుబ్బారావుగార్ల చే ప్రకటింపబడినది” అని ఉద్ఘోటించబడినది 06/01/1930 తారీఖున వారి ఇంకో పుస్తకం “నిర్భాగ్య భారతము” పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీవారిచే ప్రచురించబడి స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా విడుదల చేయ బడింది. ఆ కాలంలోనే బెజవాడ బార్ యసోసియేషన్ వారు ఒక ప్రస్తావనచేసి స్వాతంత్ర్యోద్యమానికి సమర్దనగా తీర్మానించారు ఆసందర్భములో శివరాపుగారి డైరీలో ఇలా వ్రాసుకున్నారు “I was in great excitement”. 1930 మార్చి నుంచీ జూన్ మధ్య కాలంలో శివరావుగారివి మరి కొన్ని పుస్తకాలు కాంగ్రెస్సు కమిటీవారు ప్రచురించినవి “ ఆంధ్ర పౌరుషము, కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమము, పాంచజన్యము, దరిద్రనారాయణీయము, బార్డోలీ సత్యాగ్రహ విజయము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము and సత్యాగ్రహ బోధిని” ఈ పుస్తకాలు సాధారణ ప్రజానీకానికి, కాంగ్రెస్సు కార్యకర్తలకు మన దేశ ఆర్థిక రాజకీయ, రాజ్యాంగ విషయాలను సరళమైన తెలుగులో బోధించడానికి ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకాలు. బ్రిటిష్ వారు పరిపాలనలో మనదేశ ప్రజలను ఏవిధంగా ఆర్థికంగా దోచుకుంటున్నదీ ఈ పుస్తకాలలో బోధింప బడినవి. సబర్మతీలో తయారైన ఉప్పును గాంధీగారు తీసుకువచ్చిన రోజుతో జతగా బెజవాడలో శివరావుగారి పుస్తకము సత్యాగ్రహబోధిని 04-05-1930 తారీఖున వెలువడించ బడింది. 08/05/1930 నాడు బెజవాడలో డా [[వెలిదండ్ల హనుమంతరావు]] గారి ఆధ్వర్యాన్న జరిగిన ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపులో శివరావుగారు కూడా వెళ్ళారు. కాంగ్రెస్స వారి అధినియమం ప్రకారం మారుమూలల గ్రామాలలో నున్న ఆర్థికక్షీణత, అభివృధ్ధి శూన్యత మొదలుగు అంశాల వాస్తవిక స్థితిని బయటకు తీశే నిమిత్తం చేయబడిన ఒక ప్రశానావళిని శివరావు గారు 10/05/1930 తారీఖనాడు తయారుచేయగా కాంగ్రెస్సు అగ్రనాయకులు గ్రామాలకు వెళ్లినపుడు కాంగ్ర్రస్సు కార్యకర్తలకు ఆప్రశ్నావళి పంచపెట్టి దానిని పూర్తిచేయించి తిరిగి తీసుకుచ్చి శివరావు గారికివ్వటం వారు వాటిని సంకలితంచేయించి వ్యాఖ్యానంచేసి కాంగ్రెస్సు అధిష్ఠానంకి పంపిచేవారు. ఉప్పు సత్యాగ్రహ ఆందోళన కాలం 1930 లో కృష్ణాజిల్లా ముఖ్యంగా బెజవాడలో జరిగనటువంటి కార్యకలాపాలు ఈ క్రింది విధంగా వివరించారు:
15/04/1930 తారీఖునాడు గంపలగూడెం కుమార రాజాగారు మరియు డా వెలిదండ్ల హనుమంతరావు గారు రెండు విడతలుగా చిన్న పురం వెళ్ళి వారు తయారు చేసితీసుకుచ్చిన
04/05/1930 నాడు బెజవాడలోని యావన్మంది ప్లీడర్లు ఆప్పటి మూడురంగుల జాతీయ పతాకమును పట్టుకుని రహదార్లలోఊరేగింపుగా వెళ్లారు. 1/05/1930 నుంచీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఉప్ప
తరువాత ఆంధ్ర కాంగెస్ కమిటీ మీటింగులు ఏప్రిల్ 1931 లోను జరిగినవి. స్వరాజ్య పత్రికకు వెంగళ రామయ్య బెజవాడలో ఏజన్సీ తీసుకోటానికి నశ్చయించారు. 10/05/19131 తారీఖున ప్రకాశంగారు బెజవాడ వచ్చారు నిధులు పోగుచేసుకునేందుకు
|