దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 144:
==ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వమువారి గ్లాసరీ ( నిఘంటువు) కమిటీ లో శివరావుగారి కృషి==
1957 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభాద్యక్షులైన ఆయ్యదేవర కాళేశ్వరరావుగారు వారు ఏర్పాటు చేయునున్న గ్లాసరీ సంస్థ గురించి ముందుగా ముఖ్యమైన నలుగురు ప్రముఖలుకు వారి అభప్రాయముకోరుతూ వ్రాయగా వారు నలుగురూ (గిడుగు సీతాపతి, నార్ల వెంకటేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ) ఏక ఖంఠంతో శివరావుగారిని సభ్యునిగా చేర్చమని వ్రాశారు. శివరావు గారు 1934 లోనే వ్యవహారిక పదకోశము మరియు శాస్త్ర పరిభాష రచించినవారైనందున వారి పేరు ఆ నలుగురు ప్రముఖులు వక్కాణించటమైనది. శివరావుగారి ఆ పుస్తకమును గూర్చి మద్రాసు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి20/1/1935 న ఇలా వ్రాశారు “this book is first of its kind and supplies a long felt need”. ఆ కమిటీ హైదరాబాదులో శాసన సభా మందిరంలో జరిగేది దానికి విజయవాడలోని రెండు ఉప సభల్లో నొకటి శివరావుగారి ఇంట్లో జరిగేది. మొట్టమొదట అక్టోబరు 1957 లో హైదరాబాదు కమిటీలో 32 మంది సభ్యులతో చేయబడింది. తరువాత డిసెంబరు 1958 లో సభ్యులని 16 మందిగా చేశారు తరువాత రెండు సబ్ కమిటీలు విజయవాడలోపెట్టారు. 1958నాటి విజయవాడ శివరావు గారింట్లో సబ్ కమిటీకి విశ్వనాధ సత్యనారాయణ గారిని అధ్యక్షునిగాను శివరావుగారిని కన్వీనరు. సభ్యులు కాటూరి వెంకటేశ్వరారావు,, గరికిపాటి కృష్ణమూర్తి, యమ్. ఆర్. అప్పారావు (శాసన సభ్యులు), [[గిడుగు వెంకట సీతాపతి]], రామస్వామి నాయడు (శాసన సభ్యులు) మల్లంపల్లి సోమసేఖర శర్మ [[భమిడిపాటి కామేశ్వరరావు]] సభ్యులుగా ఉన్నారు. అదే సబ్ కమమిటీని తిరిగి మార్పుచేసి 1959 ఫిబ్రవరిలో శివరావుగారిని అధ్యక్షతన, రామస్వామి నాయడు, గరికిపాటి కృష్ణమూర్తి, కంభంపాటి సత్యనారాయణ సభ్యులుగా యున్నారు. డిసెంబరు 1958 లో History Academy పునావర్దీకరించబడినది దాని గవర్నింగ్ కౌన్సిల్ మరియు ఎడిటోరియల కమిటీ కాళేశ్వరారావుగారి అధ్యక్షతన సభ్యులు శివరావుగారు, రాళ్లబండి సుబ్బారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారును. పుట్టపర్తి శ్రీనినివాసాచారి గారు కార్యదర్శి. 1959 లో శివరావుగారు వ్రాసిన ఆఫ్రికాజాతీయోద్యమము పుస్తకమును ఆంధ్రప్రపేదేశ్ ప్రభుత్వ చరిత్ర విజ్ఞాన అకాడమీ వారు ప్రచురణను. 21-08-1959 తేదీన భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు పుస్తకావష్కరణ చేశారు. 1960 సెప్టెంబరులో కాళేశ్వరరావుగారు శివరావుగారిని భారత రాజ్యాంగమును తెనుగుసేతచేయమని కోరారు అటుతరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు చరిత్ర విజ్ఞాన అకాడమీ వారి ఆధర్యములో ఇంకో కమిటీ వేసి అందులోకూడా శివరావుగారిని సభ్యులుగా నియమించారు. 1961 లో కాళేశ్వరారావు గారు శివరావుగారు రచించే పుస్తకము ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొందరగా పూర్తిచేయమని ప్రేరేపించేవారు. ఈలోపల కాళేశ్వరరావుగారు 26-02-1962 లో పరమదించగా అప్పట్లో విద్యాశాఖా మాత్యులుగానున్న [[పి. వి.
==రాష్ట్రప్రభుత్వం పై కాపీరైటు వుల్లంఘన దావా==
|