దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 168:
 
==1972-73 లో తెలంగాణా లోని ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతములోని ఆందోళన==
02/12/1972 నాడు ఆంధ్ర ప్రభలో శివరావుగారి వ్యాసం “సత్యాగ్రహమునకు సమయము” ఆంధ్రలో ఆందోళన గురించి న వ్యాసం ప్రచురించ బడింది. అదే రోజున ఆంధ్ర తెలంగాణా సమశ్యకు సంబంధిచిన ప్రధాన మంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా శివరావుగారు వ్రాశిన రెజొల్యూషన్ ను విజయవాడ బార్ యసోసియేషన్ వారు ఏకగ్రీవంగా ఆమోదంతో స్వీకరించడం శివరావుగారు జయంతిపురం రాజాగారు (వాసిరెడ్డి సదాశివేశ్వర ప్రసాద్) జాయింటుగాఇచ్చిన వాగ్మూలం ఆంధ్రజ్యోతి లోను, దైనిక జాగరణలోను అదేరోజు (02–12-1972) నాడు ప్రచురించారు. ఆసంవత్సరం డిసెంబర్ 9 వ తారీఖునాడు మళ్ళీ బార్ యసోసియేషన్ కు History of Indian Nationalism ను గూర్చి ప్రసంగించారు. ఆనెలలోనే బెజవాడ లాయర్ల కన్వెన్షన్ కు రిజొల్యూషన్ వ్రాసి యిచ్చి వారి అధ్యక్షుని కోరిక పై ప్రసంగిచారు.. తెలంగాణ ముల్కీ నియమాలను ఖండిస్తూ వారు వ్రాసిన పెద్ద వ్యాసాలను “వారధి” అనే దిన పత్రిక డిసెంబరు 6 వ తారీఖున ప్రత్యేక సంచిక వేసి ప్రచురించారు. ఆ ప్రచురణ కాపీలు పంచ బెట్టుట జరిగింది. ప్రముఖ న్యాయవాది Mr. Seervai రచించి న కాన్ స్టిట్యూషనల్ లా ననుసరించి శివరావుగారు ఒక మెమొరాండాన్ని వ్రాసి వారి జూనియర్ వకీలు యద్దనపూడి హనుమంతరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నరు (ఖండూభాయ్ దేశాయిగారు) కు పంపించారు. భారత ప్రధాన మంత్రికి తంతి పంపిచారు. ఆంధ్ర తెలంగాణ సమశ్య తీసుకుచ్చిన ముల్కీ విధానం అమలు భార త రాజ్యాంగ పై అక్రమం జరిగినట్లని శివరావుగారు ఒక వ్యాసంలో వ్రాశారు. ఆరోజులలో పోలీసువారు అనవసరంగా విధించిన కర్ఫ్యూ పై శివరావుగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్టు వేయుటకు పెటిషన్ స్వయంగా వ్రాసి, తన జూనియర్ లాయర్ వై. వి. .హనుమంతరావుచేత రిట్ వేయించారు. జస్టిస్ చెన్నప రెడ్డిగారి బెంచి ఆ రిట్టును స్వీకరిస్తూ గవర్నమెంటుకు నోటీసు జారీ చేసి ఇంక ఆ ఆందోళన రోజలలో కర్ఫ్యూ అమలు చేయకుండా నిషేధించారు. మార్చి 1973 లో శివరావుగారు “who is responsible for violence?” అను ఒక కరపత్రం వ్రాసి ప్రచురించారు. ఇండియన్ ఎక్,ప్రస్స్ పేపరులో శివరావుగారు సంపాదకుడికి వ్రాసి న లేఖ ఫిబ్రవరి 2 తారీఖున ప్రచురించ బడింది. అదే లేఖను తెలుగు అనువాదం చేసి [[ఆంధ్ర ప్రభవారుప్రభ]]వారు ప్రచురించారు.
 
==శివరావుగారి రచించిన పుస్తకాలను గూర్చి ఆభిప్రాయాలు==