దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
'''దిగవల్లి వేంకట శివరావు''' ([[ఫిబ్రవరి 14]], [[1898]] - [[అక్టోబరు 3]], [[1992]]) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.
==జీవిత విశేషాలు==
దిగవల్లి వేంకటశివరావు గారు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తూర్పుగోదావరి జిల్లా]] [[కాకినాడ]]లో [[ఫిబ్రవరి 14]] [[1898]] న వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు [[కాలికట్]]లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం [[బెంగళూరు]]లో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రీ వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండీ నుండీ ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం స్కూలులో చదివారు. 1916 లో [[మద్రాసు]] ప్రసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) [[మద్రాసు]] లోనే పూర్తిచేసి 1922 నుండి [[విజయవాడ]]లో ప్రముఖ [[న్యాయవాది]]గా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్రచదువులోన్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య యోధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.
 
== వ్యక్తిగత జీవితం ==