చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''చల్లా సత్యవాణి''' తెలుగు రచయిత్రి. ఆమె [[కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల]] అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
కౌండిన్యస గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు 1942 ఏప్రియల్4న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.1942మే నెలనుంచి ఈమె [[దానవాయిపేట]] ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు.ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు.శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్షరర్ గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు.పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు.ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు