ఐ.కె.గుజ్రాల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 26:
భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్ 4న జన్మించిన ఇందర్ కుమార్ గుజ్రాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో [[జైలు]]కు వెళ్లారు. 1980లో కాంగ్రెస్ పార్టీని వీడారు. 1989లో జలంధర్ నుంచి [[లోక్సభ]]కు ఎన్నికయ్యారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్ సతీమణి షీలా గుజ్రాల్ పంజాబీ, [[హిందీ]], ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్ సోదరుడు సతీశ్ గుజ్రాల్ ప్రముఖ [[చిత్రకారుడు]].
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా ఉన్నారు. అనంతరం కొంతకాలం సోవియట్యూనియన్లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్ నేతృత్వంలోని జనతాదళ్లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో [[దేవెగౌడ]] సారథ్యంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.
==మూలాలు==
|