పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
క్యాంపులు పెట్టేటప్పుడు చాలామంది పల్లేటూరి వారు డబ్బు తమ వద్ద లేదని మొరపెట్టుకొనేవారు. చికిత్స ఇవ్వడంతో పాటు మెడిసిన్స్ కూడా యిచ్చేవారు. ఫుడ్ కూడా పెట్టేవారు. అద్దాలు కూడా యిచ్చేవారు. కొన్ని సంఘ సేవా సంస్థలు సహకరింపగా, తమ స్వంత డబ్బు కూడా వ్యయపరిచేవారు. రోగులకు ఖర్చుపెట్టే విషయంలో ఏ మాత్రం ఆలోచించే వారు కాదు. దేశంలో అత్యున్నత హోదాలలో ఉన్న చాలామందికి చికిత్స చేసి, "విజన్" కల్పించారు.
 
ఆయన [[1964]]లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకును వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్థిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డు]]ల కెక్కారు. [[భారత ప్రభుత్వం]] నుండి [[1971]]లో [[పద్మశ్రీ]], [[1977]]లో [[పద్మభూషణ్]] పురస్కారాలను పొందారు. ఈయన [[విశాఖపట్నం]], [[వరంగల్]] మరియు కర్నూలులలో[[కర్నూలు]]లలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు చాల కృషి చేశారు. [[1990]]లో [[కర్నూలు]]లో స్థాపించబడిన ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆయన పేరున స్థాపింపబడింది. ప్రఖ్యాత తెలుగు హీరో మెగాస్టార్ [[చిరంజీవి]] తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల కొరకు శివారెడ్డి గారి సలహాలను కోరి, ఆయన సూచనలను పాటించారు.
 
==సమాజ సేవా కార్యక్రమాలు==
కంటి చికిత్సలతో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా అనేకం చేశారు. గ్రంథ రచనలు చేశారు. దేశ, విదేశీ ప్రత్రికల్లో సైంటిఫిక్ ఆర్టికల్స్ అనేకం రాసారు. 1985 నుంచి భారతీయ విద్యాభవన్ కు ఛైర్మన్ గా యున్నారు. సిబిఐటి బోర్డులో ఉన్నత పదవులను అలంకరించారు. అళాసాగర్ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. ఈ విధంగా పలు సోషల్ ఏక్టివిటీస్ లో ఉండేవారు.
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు