బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
''మంగళ సూత్రం'' అనే స్వీయ అముద్రిత నవల ఆధారంగా ఆయన తీసిన తొలి చిత్రం '''[[వందేమాతరం సినిమా(1939)|వందేమాతరం]]''' [[1939]]లో విడుదలైంది. దాంట్లో నిరుద్యోగ, వరకట్న సమస్యలను అద్భుతంగా చిత్రించడమే కాక వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తర్వాత [[1940]]లో బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ '''[[సుమంగళి]]''' తీశాడు. ఐతే విప్లవాత్మకమైన ఈ మార్పును ప్రేక్షకులు హర్షించలేక పోయారు. ఈ చిత్రం జనామోదం పొందలేక పోయింది. తర్వాత వివాహాత్పూర్వ లైంగిక సంబంధాలు, పెళ్ళి కాని తల్లులేదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో ఆయన [[1941]]లో తీసిన '''[[దేవత (1941 సినిమా)|దేవత]]''' దక్షిణ భారతదేశమంతటా సంచలనం సృష్టించింది.
 
తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో '''[[భక్త పోతన(1942 సినిమా)|భక్త పోతన]]'''([[1942]]), '''[[యోగి వేమన]]'''([[1947]]) నిర్మించాడు. ఈ సినిమాల్లో నాగయ్య నటన తారాస్థాయినందుకుని ఆయనను తెలుగులో తొలి మెగాస్టార్ ను చేసింది. అంతవరకూ కాంచనమాల లాంటి నటీమణులే సూపర్ స్టార్స్. మొదట్లో 'సుమంగళి' చిత్రంలో నాగయ్యను వృద్ధ సంఘసంస్కర్త పాత్ర వేయమన్నప్పుడు ఆయన కళ్ళనీళ్ళపర్యంతమయ్యాడట. అయితే ఆ పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తుందని నచ్చజప్పి బి.ఎన్. ఆయనను ఒప్పించాడు. తర్వాత [[భక్తపోతన]] విషయంలోనూ దాదాపుగా అలాగే జరిగింది. ఆ పాత్రలు నిజంగానే తనకు గొప్ప పేరు తీసుకు రావడంతో నాగయ్య [[1946]]లో తనే స్వయంగా [[త్యాగయ్య(1946)|త్యాగయ్య]] తీశాడు.
 
===స్వర్గసీమ===