బాల సాహిత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ [[పిల్లలు|బాలల]] కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ భాషను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని బాలసాహిత్యంగా నిర్వచించవచ్చు.
==తెలుగు భాషలో బాలసాహిత్యం==
పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి<ref>[http://www.namasthetelangaana.com/editpage/article.aspx?category=4&subCategory=1&ContentId=490490 బాల సాహిత్య వైశిష్ట్యం- పెందోట వెంకటేశ్వర్లు]</ref>.
 
మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బాల_సాహిత్యం" నుండి వెలికితీశారు