సైమన్ కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
విచారణ సంఘము నియమించుటలోని ఉద్దేశ్యములు: 1919 సంవత్సరములో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము(చూడు [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము]]) విడుదలచేయు సమయములో తదుపరి 10 సంవత్సరముల తరువాత ఇంకయూ రాజ్యాంగసంస్కరణలు చేయవలసిన అవసరమును నిర్ణయించెదమని బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటించబడినది. ఆ సమయపరిధి దగ్గరపడుచున్నందున్న 1927 లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతక్రింద విచారణ సంఘమును (Simon Commission) నియమించారు. ఆర్భాటముగా వెలువడించబడిన బాహ్యోద్దేశ్యము అదే అయినప్పటికీ భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలోకల్లా అమూల్యమైన ఆభరణమని ఒక శతాబ్ధపునకు పూర్వమే వారి ప్రతినిధి, వంగరాష్ట్రపు గవర్నర్ [[రాబర్టు క్లైవు]] ద్వారా తెలుసుకునటమేగాక తదుపరి 1905 సంవత్సరములో విజ్ఞానకరముగా అధ్యయనముచేసిన గవర్నర్ జనరల్ (వైస్ రాయి) [[లార్డ్ కర్జన్]] యొక్క పునః ఉద్ఘాటనతో భారతదేశమునకు స్వతంత్ర పరిపాలననిచ్చు అవకాశము కలుగనీయకుండుటకు చేదోడుగా వంతుపలుకెడి విచారణ సంఘమను పేరట ఉపశమనకార్యముగా భారతయుల కన్నీళ్ళ తుడుపుచేయుట అంతఃరోద్దేశ్యము.<br>
 
పూర్వోత్తర సందర్భములు: సైమన్ కమిటీ [[భారతదేశము]] పర్యాటనకు కొద్దిరోజుల మునుపు 1927సంవత్సరమున మద్రాసులో జరిగిన [[కాంగ్రెస్]] మహా సభలో సైమన్ విచారణ సంఘమును '''అనేకవిధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది'''. 1928 సంవత్సరములోనే '''( సైమన్ కమిటీ వారి పర్యటానంతరము, వారి నివేదిక బహిరంగము కాక మునుపే )''' భారతదేశమునందు '''సర్వపక్ష సమావేశ సభ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన చేసిన తీర్మానము''' ప్రకారము భారతదేశమునకు డొమీనియన్ స్టేటస్ (కెనడా దేశమునకు బ్రిటిష్ సామ్రాజ్యము ప్రసాదించినట్టి డొమీనియన్ స్టేటస్ వంటి) [[ అధినివేశ స్వరాజ్యము]] కావలయునని అపేక్షించబడినది. ఆ తీర్మానము ప్రకారము భారతదేశమునకు సుముఖమైన డొమీనియన్ స్టేటస్ [[రాజ్యాంగము]] చిత్తుప్రతి నిర్మాణించబడినది. సైమన్ విచారణ సంఘములో భారతీయప్రతినిదినిత్వములేదని తెలియగనే మద్రాసులో 1927లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సైమన్ కమీషన్ ను బహిష్కరించవలయునని తీర్మానించబడినది. అటుతరువాత 1928 లో జరిగిన కాంగ్రెస్సుమహాసభలో డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) కనుక ఇవ్వకపోతే సంపూర్ణస్వరాజ్యము స్తాపించెదమని బ్రిటిష్ సామ్రాజ్యప్రబుత్వమునకు ఇంకా తీవ్రమైన అంత్యహెచ్చెరిక (ultimatum) జారీచేయబడినది. 1929 డిసెంబరు 31 వ తేదీ న కాంగ్రెస్సు మహా సభలో బ్రిటిష్ వారితో సంబందము లేకనే సత్యాగ్రహము సాధనముగా సంపూర్ణ స్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానము చేయబడినది. 1930 జనేవరి 26 తేదీన ప్రధమ స్వాతంత్రదినోత్సవము దేశములో అన్ని ఊర్లలో జయప్రదముగా జరుపకొన బడినది. దేశము దాస్యమునకు, దారిద్ర్యమునకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణమని కూడా తీర్మానించబడినది. దేశప్రజలకు రాజకీయ హక్కులివ్వక భారతదేశమును బానిస రాజ్యముగా పరిపాలించుచున్న బ్రిటిష ప్రభుత్వమునకు కనీసపు ముఖ్య సంస్కరణలు చేయమని పదకొండింటిని గాంధీజీ ప్రతిపాదించెను.<ref name=>"Siva Rao(1938)"> "The British Rule in India" D.v. Siva Rao(1938) ఆంధ్ర ద్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp402-408 </ref> <br>
 
 
==సైమన్ కమిటీలోని సభ్యులు==
పంక్తి 12:
 
== సైమన్ విచారణ సంఘము బహిష్కరించబడిన కారణము, బహిష్కరణోద్యమము==
భారతదేశములో సైమన్ విచారణసంఘము బహిష్కరించబడిన కారణము; బహు ముఖ్యమైన ఆ విచారణ సంఘమున ఒక్క భారతీయుడు తగడని సభ్యునిగా నియమించకపోవుటయే. సైమన్ కమీషన్ బహిష్కరించ వలెనన్న నిర్ణయము డిసెంబరు మాసము, 1927 సంవత్సరమున మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్సు సదస్ససున జరిగినది. శక్తివంతమైన తీర్మానముచేయబడినది. కాంగ్రెస్సు పార్టీ వారే కాక భారతదేశములో అప్పటిలో పలుగుబడిగలిగియున్న [[ హిందూమహాసభ]] మరియూ [[ ముహమ్మద్ అలీ జిన్నా ]] నాయకత్వమందలి [[ముస్లిమ్ లీగ్]] మొదలగు పార్టీలు (ఒకటి, రెండు పార్టీలు తప్ప), ప్రజా నాయకులు కూడా సైమన్ కమీషన్ ను బహిష్కరించ నిశ్చయించిరి. అందుచే బహిష్కరణ కార్యక్రమములో భాగముగా సైమన్ సంఘ సభ్యులు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వారిని తిరస్కరించుటకు ఒక ఉద్యమము గా కార్యక్రమము నెలకొల్పి, గొప్పజాతీయభావముతో యావద్భారతదేశములో అమలుచేయబడెను. సైమన్ కమిటీ పర్యటించిన ప్రతి ఊరులో హార్తాళ్ ప్రకటించి నల్ల జండాలతో తిరస్కారభావముచూపబడెను. బ్రిటిష్ ప్రభుత్వము నిషేదాజ్ఞలు ప్రకటించి ఆందోళనకారులపై పోలీసు లాఠీ ఛార్జీలు జరిగినవి. అప్పటి బహిష్కరణోద్యమములో పోలీసు లాఠీఛార్జీవల్లన అనేకులు గాయపడిరి. అందులో ప్రముఖులు లాహోరు నగరములో [[లాలా లజపతిరాయ్]], లక్నో నగరములో [[గోవింద్ వల్లభ్ పంత్]], [[జవహర్లాల్ నెహ్రూ]]. <ref name= "Sivarao (1938)"> "The British Rule in India" D. V. Siva Rao (1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 402-405 <"/ref>
 
=== బహిష్కరణాందోళన - లాలా లజపత రాయి మరణము ===
పంక్తి 23:
(2) వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభువులతో భేటీ <br>
 
(3) సైమన్ కమీషన్ నియామకము, పర్యటన పట్ల భారతీయులలో కలిగిన తీవ్ర విరోధమైన అసమ్మతి, ఆందోళన పరిస్తితులు వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండునందలి బ్రిటిష్ ప్రభువులకు తెలిపి దేశములో కొంత శాంతి కలుగచేసి ప్రజల అపోహలను పోగొట్టుటకు, కనీసము కొందమంది భారతీయ ప్రజానాయకులనైననూ సంతృప్తి పరచుట అవసరమని బ్రిటిష్ ప్రభువులకు నచ్చచెప్పి వారి సమ్మతితో 1929 అక్టోబరు 31 వ తేదీన చేసిన ప్రకటన ఉల్లెఖన " 1917 వ సంవత్సరమున చేయబడిన ప్రకటనను బట్టి భరతఖండ రాజ్యాంగాభివృధ్దియొక్క సహజపరిణామము అధినివేశరాజ్యాంగ పధ్దతియేయని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారి అభిప్రాయము....... ఈ ఉద్దేశ్యము పరిపూర్ణముగా నెరవేరుటకు భరతఖండములోని సంస్థానములు కూడా రాజ్యాంగమున స్థానమొసగి ఒక విదమగు అఖిలభారత-ఐక్యత కోరువారి ఆశకు భంగము లేకుండా ప్రస్తుతపు రాజ్యాంగవిధానమునందలి వ్యవహారములు జరుగువలయుననియు, ఇందుకొరకు సైమన్ సంఘము వారు రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన తమ నివేదికను ప్రకటించిన పిదప పైన చెప్పబడిన సంగతులు చర్చించి యాలోచించుటకును బ్రిటిషు-భారత రాజ్యాంగ సమస్యయు, అఖిల భారత రాజ్యాంగసమస్యయు చర్చించుటకు బ్రిటిషురాజ్యమునందలి ప్రతినిధిలును రౌండుటేబిలుసభ కాహ్వానింపబ డుదరనియు ఈ మార్గమున చర్చించపబడిన సమస్యలలో నాసభవారి ఆలోచనలయందు అధిక సంఖ్యాకులసమ్మతినిబడసిన విషయములు శాసనము చేయగలందులకు పార్లమెంటు వారికి నివేదింబడును". <ref name= "SivaraoSiva Rao(1938)" />
<br>
 
(4) వైస్ రాయి లార్డ్ ఇర్విన్ యొక్క పరిపాలనందలి తొలిరోజులలోని నిరంకుశత్వము తగ్గుముఖం పడి చివరి కార్యాచరణముగా 1931 సంవత్సరములో గాంధీజీ తో రాజీకి వచ్చి [[గాంధీ-ఇర్విన్ సంధి]] జరుగుట సైమన్ కమీషన్ బహిష్కరోణద్యమ ఫలితమే అనవచ్చు <br>
"https://te.wikipedia.org/wiki/సైమన్_కమిషన్" నుండి వెలికితీశారు