నువ్వు నాకు నచ్చావ్: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 19:
[[నువ్వు నాకు నచ్చావ్]] [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[ఆర్తీ అగర్వాల్]] నాయకా నాయికలుగా సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం.
==కథ==
వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) [[అనకాపల్లి]] నుంచి [[హైదరాబాద్]] లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి ([[ప్రకాష్ రాజ్]]) ఇంటికి వస్తాడు. సంధర్బం మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.
 
అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.