రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==జీవిత విశేషాలు==
రఘుపతి వెంకటరత్నం నాయుడు [[1862]], [[అక్టోబరు 1]] న [[మచిలీపట్నం]]లో సుప్రసిద్ద [[తెలగ]] నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. [[హిందీ]], [[ఉర్దూ]], [[పర్షియన్]] భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి [[హైదరాబాదు]] బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత [[మద్రాసు]] [[క్రిస్టియన్ కళాశాలలోకళాశాల]]లో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.
 
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] పచ్చయప్ప కళాశాలలో [[ఇంగ్లీషు]] ఆచార్యునిగా పనిచేసాడు. [[1904]]లో [[కాకినాడ]] లోని [[పిఠాపురం]] రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. [[1911]]లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. [[1925]]లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] బిల్లును రూపొందించి [[శాసనసభ]]లో ఆమోదింపజేసాడు. [[1927]]లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
 
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు.