కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా పాంచజన్యం (అనువాదం) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్త
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు''' ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు [[1937]]లో కృష్ణాజిల్లా [[కైకలూరు]] గ్రామంలో జన్మించాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి సంస్కృతంలో ఎం.ఎ., పి.హెచ్.డి చేశాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగాడు. ఇతడు సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశాడు. [[హిందీ]], ఆంగ్ల భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి [[తర్జుమా]] చేశాడు. ఇతడు [[అష్టావధానం]], [[నేత్రావధానం]] మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఇతనికి పేరును తెచ్చిపెట్టాయి.ఇతడు అనేక సెమినార్లలో తెలుగు, సంస్కృతాలలో పత్రసమర్పణ చేశాడు. ఆకాశవాణిలో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], దేశభక్తి గేయాలు, నాటికలు ప్రసారం చేశాడు. ఇతడు పలు స్టేజి, రేడియో నాటకాలలో నటించాడు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశాడు.
 
ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘కొత్తపల్లి‘[[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు’ప్రసాదరావు]]’
 
వందేమాతరం-అని అన్న బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృదేశ భక్తితత్త్వాన్ని మరోసారి చిగురింప చేశాడు! మాతృదేశ భక్తి మన జాతీయతా వికాసానికి సనాతన ప్రాతిపదిక! మాతాభూమీ పుత్రోహం పృథిత్వాః’ అని సృష్ట్యాదిలో వేదద్రష్టలు ఎలుగెత్తడంతో ఈ జాతీయతా వికసనం అంకురించింది. భారతి నా కన్నతల్లి . నేను ఆమె పుత్రుడను’ అన్నది జాతీయతా వికాస క్రమానికి అమృతబీజం! బంకించంద్రుని వంటివారు ఈ హైందవ జాతీయతా వన వికాస ప్రేరక కృషీవలుడు.. అలాంటి మరో కృషీవలుడు కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు. ‘వందే భారతమాతరం సురవరాం వాత్సల్య పూరాం ధరామ్..’ అని క్రీ.శ. 1980వ దశకంలో నినదించిన అభినవ బంకిం చంద్రుడు ‘ఘనశ్యామల’.. తెలుగువాడైన ఘనశ్యామల ఫ్రసాదరావు సంస్కృత భాషలో రచించిన ఈ భారతమాత స్తోత్రం’ దేశవ్యాప్తంగాను, విదేశాలలోను పాతికేళ్లకు పైగా లక్షలాది ‘వరాలబిడ్డలు’ నిరంతరం ఆలపిస్తున్నారు. ‘సుకవి జీవించు ప్రజల నాలుకల మీద’ అన్న మహాకవి జాషువా నిర్ధారణకు మరో ‘నిజం’ కొత్తపల్లివారి జీవన ప్రస్థానం. క్రీ.శ. 1937లో కృష్ణాజిల్లా కైకలూరులో[[కైకలూరు]]లో జన్మించిన ఘనశ్యామల ప్రసాదరావు పార్థివ శరీర పరిత్యాగం చేసి పరమపదం వైపు సాగిపోయాడు. ఆయన ‘సమకాల ప్రచార ప్రమాణాల ప్రాతిపదిక’గా ప్రసిద్ధుడు కాకపోవచ్చు. కాని భరతమాతృ ఆరాధనను ఆజీవన వ్రతంగా ఆచరించిన విశుద్ధుడు. ‘కాషాయాంబర చుంబితాంబర యశః కాదంబినీ కేతన’ అయిన మాతృభూమిని అజరామర అక్షర సుమాలతో అర్చించిన అద్భుత జీవనుడు, జాతీయత సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధుడు..
 
ఐదువేల ఏళ్లకు పూర్వం [[వేదవ్యాసుడు]] వ్రాసిన మహాభారత [[ఇతిహాసం]] సుప్రసిద్ధం. దాదాపు ఎనిమిది వందల ఏళ్లకు పూర్వం అగస్త్య పండితుడు రచించిన బాలభారత సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది కాదు. కొంతమంది సంస్కృత పండితులకు మాత్రమే పరిచయమై ఉండవచ్చు. అలాంటి విశుద్ధ కావ్యానికీ, విలక్షణ కవికీ ఆధునిక కాలంలో ప్రసిద్ధిని కలిగించిన ఘనత ‘ఘనశ్యామల’ది. ‘అగస్త్య పండితాస్ బాలభారత-ఎ క్రిటికల్ స్టడి’-అన్న పేరుతో ఈ సంస్కృత కావ్యం గురించి ఘనశ్యామల రాసిన ఆంగ్ల విమర్శ గ్రంథం భారతీయతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పగలిగింది. ఆర్భాటం లేని రీతిలో ఘనశ్యామల దాదాపు పదిహేను సంవత్సరాల పాటు దేవాలయ వ్యవస్థ గురించి అధ్యయనం చేశాడు, పరిశోధన చేశాడు. ప్రారంభించిన తరువాత పనిపూర్తయ్యే వరకు అదే ధ్యాసతో తపస్సు చేయగలిన కఠోర నియమశీల ఘనశ్యామల. ‘అవధాన కళానిధి’ కాబట్టి అనేక కార్యక్రమాలపై ఏకకాలంలో ధ్యానం నిలపగలిగిన ‘ఆర్ష విజ్ఞాన విశారదుడు’ ఘనశ్యామల. తన పరిశోధన అధ్యయనం ప్రాతిపదికగా మూడు పుస్తకాలను రచించాడు. ‘భారతీయ దేవాలయాల’ గురించి శోధించాడు. పరమపద సోపానాలు-దేవాలయాలపై బొమ్మలు అన్న సనాతన జీవన పద్ధతికి భాష్యం చెప్పాడు. దేవాలయ వ్యవస్థను కించపరచడానికి, బొమ్మలకు అశ్లీలత అద్దడానికి సంస్కృతి వ్యతిరేకులు సాగించిన కుట్రకు విరుగుడు ఘనశ్యామల రచించిన ఈ గ్రంథం. ‘జీవించే దేవాలయం’ అన్నది ఆయన కృషికి పరాకాష్ఠ.
 
తాపీ ధర్మారావుగారు గొప్ప పండితులు. ఆయన హేతువాద దృష్టితో 1936లోనే ‘దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని ఓ చిన్న పుస్తకం వెలువరించారు. నిజానికి ధర్మారావుగారు రాసిన మిగతా పుస్తకాలేమిటో తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివారు. పనిగట్టుకుని ఆ పుస్తకాన్ని పదే పదే అచ్చువేయించి, బతికించిన తీరు, మనిషి మనస్తత్వానికి ఒక ఉదాహరణ. వారణాసి సుబ్రహ్మణ్య శాస్ర్తీగారనే మరొక పండితుడు ‘తాపీ వారి దూషణమునకు సమాధానము’ అని మరో పుస్తకం రాసి వేయించారు. కానీ, అది మాత్రం అంతగా ప్రచారంలోకి రాలేదు. పూర్వపక్షం, అంటే ప్రతివాదం, లేదా ఖండనగా వచ్చిన పుస్తకం ఎక్కడో మరుగున వుండిపోయింది. తాపీవారి పుస్తకం పుట్టిన తరువాత పుట్టిన డా.కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు ప్రస్తుతం ఈ ‘దేవాలయాలపై బొమ్మలు’అనే పుస్తకాన్ని తాపీవారి మాటలకు ఖండన రూపంగా అందిస్తున్నారు. ఈ రచయిత మామూలు మనిషేమీ కాదు. ఎనె్నన్నో పుస్తకాలు రాసారు. దేశమంతటా తిరిగి ఎంతో సమాచారం సేకరించారు. ఎన్నో గ్రంథాలనుంచి విషయం గురించి ఎంతో సమాచారాన్ని సమకూర్చారు. అన్నింటినీ ఆధారాలుగా వారే ముందు, తాపీవారి వాదాలకు, తరువాత ఆరుద్రగారి ఒక రచనకు, మాటకు మాట పద్ధతిలో సవివరంగా సమాధానాలు రాశారు. చివరకు దేవాలయాల మీది ‘బూతు’‘[[బూతు]]’ [[బొమ్మలు]], ‘పరమ పద సోపానాలు’ అంటూ తమ వాదం అందించారు. ఒక విషయాన్ని గట్టిగా నమ్మిన వారికి, ఆ విషయాన్ని మరొకరు చులకన చేసి, కించపరిస్తే బాగా కోపం కలుగుతుంది. విషయం మనసునకు మరీ దగ్గరైనదైతే కోపము కూడా ఎక్కువవుతుంది. ప్రసాదరావుగారి రచనలో ఈ కోపం కనపడుతుంది. ఎప్పుడో పోయిన ఒక వ్యక్తికి సమాధానంగా కాక, ఆ వ్యక్తి అభిప్రాయాలకు ఖండనగా మాత్రమే రచన సాగితే మరింత బాగుండేది. అట్లాగని ఈ ఖండనలో పస లేదంటే తప్పు తప్పున్నర! తాపీ వారి మాటలను ఒక్కొక్కటే ఎత్తుకుని జవాబు చెప్పిన తీరు ఆలోచింప చేసేదిగా ఉంది. మామూలు పాఠకుడు, పండితుని అభిప్రాయాన్నివిని, ‘అవునేమో’ అనుకుంటాడు. మరి వారిలో వివేచన కలిగించడమా, సరదా కోరికా? అన్న ప్రశ్నతో చర్చ మొదలవుతుంది. ‘మాటలకు అర్థాలు మరిచిపోయారని’ తాపీవారు చేసిన అభియోగం మీద మరొక మంచి చర్చ సాగుతుందిక్కడ. ‘మనిషే దేవుని సృష్టించాడు’ అన్నది తాపీవారి మరొక మాట. ప్రసాదరావుగారి ప్రతివాదంలో, మనుజులంతా మనువు సంతతి, మనువు తనను దేవుడు సృష్టించాడు అన్నాడు అంటూ చెబుతూ పంచ మహా భూతములను దేవుడు సృష్టించాడు, ద్వాపర, కలియుగాలలో మాత్రమే సంతాన ప్రాప్తి కొరకు స్ర్తి, పురుషుల కలయిక అవసరం అయింది లాంటి ఎన్నో వాదాలను చెబుతారు. వీటన్నిటికీ ఆధారాలు కూడా చూపుతారు. ఇవన్నీ ఈనాటి చదువులకు, అవగాహనలకు అందని సంగతులని అనే వారున్నారు. సృష్టి, దేవుడి సృష్టి, వాటికి ఆధారాలుగా చూపుతున్న ఆకారాలు అన్నీ మనిషి సృష్టించినవే అంటే, వాదం మరింత ముందుకు సాగుతుంది. ద్రౌపది, అయిదుగురు భర్తలు గురించి ఈ పుస్తకంలో చక్కని చర్చ వుంది. ఇటీవల వచ్చిన ఒక రచన గురించి కూడా ఇక్కడ ప్రసక్తి వుంది. పండితులు ఈ రకంగా చర్చ జరుపుతూ వుంటే, మామూలు పాఠకులకు కూడా ఆలోచించే అలవాటు కలుగుతుంది. స్ర్తి పురుష అంగాలు, లింగారాధన, ప్రతీకలు మొదలైన అంశాల గురించిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కానీ, వాదంలో చివరి మాట నాదే, అన్న ధోరణి మరింత చర్చకు వీలు లేకుండా చేస్తుందేమో? ఎదుటి వారిది వితండ పద్ధతి అయినంత మాత్రాన మనదీ అదే తీరు కాకూడదు గదా! 118 పేజీల వరకు తాపీవారి మాటలకు చక్కని సమాధానాలతో రచన సాగుతుంది.మొత్తం భరతభూమి సనాతన జీవన మందిరం, భరతమాత సనాతన దేవత అన్నది ఆయన జీవన ప్రస్థానంలో నిరంతరం భాసించిన స్ఫూర్తి. ఆయన మలుపు తిరిగాడు. కనుమరగయ్యాడు. ‘స్ఫూర్తి’ నిరంతరం కొనసాగుతుంది.
 
ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా పాంచజన్యం ([[అనువాదం]]) [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] లేక సంక్షిప్తం గా
 
.
పంక్తి 19:
ఏదేని ఒక విషయం గురించి తెలుసు కోవటం తప్పనిసరి అయినపుడు సరైన పద్దతిలో తెలుసుకొని దాని గురించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అన్నివిధాలా మంచిది. ఆలా మనం ఆర్.యస్.యస్. గురించి తెలుసుకోవాలనుకుంటే ‘పాంచజన్యం ‘ అనే ఈ గ్రంథాన్ని చదవటం సరి అయిన పని. దీని ఆంగ్ల మూలం పేరు ‘బంచ్ ఆఫ్ థాట్స్ ‘. దీని హిందీ అనువాదం పేరు ‘విచార్ ధన్ ‘. ఇది ఆరేడు వందల పేజీల ఉద్గ్రంథం. ఆర్.యస్.యస్. వర్గాలకీ గ్రంథం బైబిల్ లాంటిది. ఈ గ్రంథం ఎవరూ రచించినది కాదు. ‘గురూజీ ‘ గా సుప్రసిద్దులైన మాధవ సదాశివ గోల్వల్కర్ ఆర్.యస్.యస్.కు సర్ సంఘ్ చాలక్ గా ఉన్న 33 సంవత్సరాల (1940-1973) సుదీర్ఘ కాలం లో చేసిన అనేక ఉపన్యాసాలలోని ముఖ్యమైన విషయాలను, ఆర్.యస్.యస్. భావజాలాన్ని ప్రతిబింబించేటట్లుగా ఏర్చికూర్చి ‘కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు చేసిన సకలనం ఈ గ్రంథం.
 
ఆర్.యస్.యస్. అనే మొక్కను హెడ్గేవార్ నాటితే, ఆ మొక్కను గోల్వల్కర్ చెట్టు గా పెంచారు. దేవరస్ ఆ చెట్టును వట వృక్షంగా పెంపొందించారు అని తెలిసిన వారు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురిలో కూడా గోల్వల్కర్ విశేష ఖ్యాతి నార్జించారు. ఆర్.యస్.యస్. కు పటిష్ఠమైన పునాదులేర్పరచి దానిని చిరకాలం నిలచి ఉండే సంస్థగా తీర్చిదిద్దారు. ఆ సంస్థ నుండి పుట్టిన ఒక శాఖ ఐనటువంటి బి.జె.పి. పార్టీ భారతదేశాన్ని పాలించే స్థాయికి ఎదిగినదంటే ఆ సంస్థకు ఎంతటి బలమైన [[పునాది]] ఉన్నదో, ఆ సంస్థ వెనుక ఎంతటి పవిత్ర సంకల్ప శక్తి దాగి ఉన్నదో మనం ఊహించికోవచ్చు.
 
ఈ గ్రంథం ద్వారా ఆర్.యస్.యస్. గురించి , దాని మౌలిక భావజాలం గురించి ,‘హిందూ రాష్ట్ర ‘ సిద్దాంతం గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు