మైనంపాటి భాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''మైనంపాటి భాస్కర్'''(1945-2013) ప్రముఖ [[తెలుగు]] నవలా/కథా రచయిత మరియు కార్టూనిస్టు. 40 సంవత్సరాలపాటు నవలలు, కథలు, రేడియోనాటకాలు, సమీక్షలు, కాలమ్స్, సినిమా రివ్యూలు, విమర్శావ్యాసాలు వ్రాశాడు. 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి రచనల్లో స్త్రీ పక్షపాతం, దేశభక్తి కనిపిస్తాయి<ref>{{cite news|last1=విలేకరి|title=రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత|url=https://web.archive.org/web/20160926160107/http://www.sakshi.com/news/top-news/minam-pati-passes-away-42285|accessdate=26 September 2016|work=సాక్షి|agency=న్యూస్‌లైన్|publisher=Sakshi Media group|date=4 June 2013}}</ref>. ఇతని నవలలు వాషింగ్‌టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరచబడినాయి.
==జీవిత విశేషాలు==
ఈయన [[1945]], [[నవంబరు 27]] వతేదీన [[ప్రకాశం జిల్లా]]లోని [[ఒంగోలు]]లో ఎం.హెచ్.వి.అప్పారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన [[కర్నూలు]]లోని [[కొత్తపేట]] మునిసిపల్ స్కూలులోను, కోల్సు మెమోరియల్ హైస్కూలులోను, మునిసిపల్ హైస్కూలులోను చదివాడు. తరువాత [[హైదరాబాదు]]లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి డిగ్రీ పొందాడు. ఈయన కార్మిక భీమాసంస్థలో 20 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసి తరువాత రచనా వ్యాసంగాన్నే జీవనోపాధిగా స్వీకరించాడు. కొంత కాలం కలర్‌చిప్స్ సంస్థలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఈయన మొదట కార్టూనిస్టుగా పత్రికా రంగంలో ప్రవేశించి పిమ్మట [[కథలు]], నవలలు వ్రాశాడు. ఈయన వ్రాసిన వెన్నెలమెట్లు అనే నవల [[అరుణకిరణం]] అనే సినిమాగా వెలువడి నంది పురస్కారాన్ని గెలుపొందింది. ఇతడు వ్రాసిన కథలు ఆంగ్లంలోనికి, ఇతర భారతీయ భాషలలోనికి అనువాదం అయ్యాయి. ఈయన [[2013]]లో [[జూన్ 4]]వ తేదీన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
 
==నవలలు==
"https://te.wikipedia.org/wiki/మైనంపాటి_భాస్కర్" నుండి వెలికితీశారు