గండికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

కథనంలో గల వ్యాకరణ వైపరీత్యాలను సమవరించాను.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గండికోట యుద్ధం''': [[తెలుగు]] వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, [[హిందూధర్మ]] సంరక్షణా తత్పరతకు ప్రతీక [[గండికోట]]. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యానికి]] వెన్నెముకగా నిలచి, [[విజయనగర]] రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని కమ్మ నాయకులకు]] నెలవు [[గండికోట]].
 
==గండికోట==
 
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>కి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన [[లోయ]]లతో, ఎర్రటి [[గ్రానైట్]] శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
==పెమ్మసాని చినతిమ్మానాయుడు==
 
విజయనగర సామ్రాజ్య స్థాపకుడు [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. [[ధరణికోట]] సమీపమున గల [[బెల్లంకొండ]] వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబురిగె ([[గుల్బర్గా]]) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి [[రెండవ ప్రౌఢ దేవరాయలు]] క్రీ. శ. 1422లో [[యాడికి]] పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని [[గుత్తి]], [[తాడిపత్రి]], [[జమ్మలమడుగు]] ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా [[పెమ్మసాని రామలింగ నాయుడు]], పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ, బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో [[గండికోట]] ముస్లిముల వశమయ్యింది.
 
==మీర్ జుమ్లా==
 
మీర్ జుమ్లా పారశీక ([[ఇరాన్]]) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. [[గోలకొండ]] రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి [[భారతదేశము]] చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో [[ఓడ]]లు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను [[అబ్దుల్లా కుతుబ్ షా]] ప్రాపకము సంపాదించి దర్బారులో [[వజీరు]] స్థానానికి ఎదిగాడు. [[మచిలీపట్టణము]]లో స్థావరము ఏర్పరచుకొని తెలుగు దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు<ref>The Life of Mir Jumla, J. N. Sarkar, Rajesh Publications, Delhi, 1979, pp. 4-5</ref>.
 
[[విజయనగర]] సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న [[రాయలసీమ]]పై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన [[పెమ్మసాని నాయకులు]] పాలిస్తున్న [[గండికోట]], జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. [[గోలకొండ]] దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన మైల్లీ అను [[ఫ్రెంచ్]] ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు<ref>The French in India, Rose Vincent, 1990, Popular Prakashan, p.9, ISBN 0861322592</ref>.
 
==యుద్ధం==
పంక్తి 25:
==పతనం==
 
మీర్ జుమ్లా గండికోటలోని మాధవస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. [[దేవాలయానికి]] చెందిన వందలాది [[గోవులను]] చంపించాడు<ref>District Gazetteer, Cuddapah, C. F. Brackenbury, 1915, Government Press, Madras, ISBN 8120614828</ref>. కోటను ఫిరంగుల తయారీకి స్థావరంగా మార్చాడు.<ref>గండికోట కైఫీయత్</ref> గండికోటపై సాధించిన విజయంతో మీర్ జుమ్లా [[మచిలీపట్నం]] నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు<ref>Asia in the Making of Eurpe: A Century of Advance, Book 2, South Asia, D. F. Lach and E. J. Van Kley, 1998, University of Chicago Press, p. 1077; ISBN 0226467678, 9780226467672</ref>. ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోటను సందర్శించాడు.
 
బంధువుల సాయముతో [[మైసూరు రాజ్యము]] చేరిన పిన్నయ నాయుణ్ణి తమిళదేశానికి తరలించారు. గండికోటలోని అరవయ్యారు ఇంటిపేర్లు గల [[కమ్మ]] వంశాలవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలామంది [[గంప]]లలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, [[మధుర]], [[గుంటూరు]], [[తిరుచినాపల్లి]] మొదలగు ప్రాంతాలకు పోయారు. వీరికే '[[గంపకమ్మవారు]]', '[[గండికోట కమ్మవారు]]' అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు, నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు [[మధుర]] సమీపములోని కురివికులం, నాయకర్‌పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.
 
మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయాలు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
"https://te.wikipedia.org/wiki/గండికోట_యుద్ధం" నుండి వెలికితీశారు