ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శోద → శోధ, కూడ → కూడా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref>అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
{{Cite web|title= [[తెలుగు]] సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు|last=శ్రీ లింగాల|first= రామతీర్థ |url=http://www.prabhanews.com/specialstories/article-61775 | publisher= ఆంధ్రప్రభ|date=2009-12-28|accessdate=2014-03-15}}
</ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి [[తెలుగు]] కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>
 
1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు<ref>విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు- చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి</ref>. సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు<ref>తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>.
==బాల్యం==
సాంఖ్యాయన శర్మ 1864లో [[మద్రాసు]] ప్రెసిడెన్సీలోని విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]లో విద్యాధికులైన నియోగి [[బ్రాహ్మణ]] కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించాడు.<ref>[http://www.maganti.org/PDFdocs/achanta.pdf మాగంటి.ఆర్గ్ లో పత్రము]</ref>
==విద్య==
 
==వృత్తి==
సాంఖ్యాయన శర్మ 1903లో [[కల్పలత]] అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక.
 
== సాహిత్యరంగం ==
=== నాటకరంగం ===
[[File:Andhra nataka kala parishattu.jpg|thumb|ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులలో ఆచంట సాంఖ్యాయనశర్మ, 1929]]
1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855|accessdate=11 December 2014}}</ref> ప్రథమ పరిషత్తు మహాసభలకు [[దేశోధ్ధారక]], [[విశ్వదాత]] [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.
 
===కల్పలత పత్రిక===
ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడా ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు [[లలిత]], [[విశాఖ]] మరియు అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.<ref>[http://www.sundarayya.org/eap/EAP287/Note%20on%20the%20List%20of%20Journals%20to%20be%20done%20in%20the%20project.doc List of Telugu Journals published prior to 1947 ] {{deadlink|date=March 2014}}</ref>
 
===రచనలు===