కరుటూరి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==కరుటూరి గ్లోబల్==
[[ఆస్ట్రేలియా]] పర్యటనలో, భారత దేశపు గులాబీల చిన్న పరిమాణము వల్ల వ్యాపారము వృద్ధి కావడం లేదని గ్రహించి, కొడుకు సాయిరామకృష్ణ ను కెన్యా దేశము లో గులాబీల సాగు చేయమని ప్రోత్సహించాడు. అమెరికాలో[[అమెరికా]]లో వ్యాపార శాస్త్రములో పట్టా పొందిన రామకృష్ణ తండ్రి స్ఫూర్తితో 150 ఎకరములలో గులాబీలు సాగుచేసి యూరోప్ దేశాలకు ఎగుమతి మొదలుపెట్టాడు. క్రమముగా ఇథియోపియాలో[[ఇథియోపియా]]లో 300 ఎకరాలు తీసుకొని [[యూరోప్]], అమెరికాలకు రోజా పువ్వుల వ్యాపారం విస్తరించాడు. ప్రస్తుతం మూడు దేశాలలో, 900 ఎకరాలలో గులాబీ మొక్కల సాగు నడుస్తున్నది. కరుటూరి గ్లోబల్ ప్రస్తుతము ఇథియోపియాలో 1,11,700 హెక్టార్లలో [[వరి]], [[మొక్కజొన్న]], [[చెరకు]], కూరగాయలు మొదలైన పంటలు పండిస్తున్నది.ప్రపంచములో అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్థగా ఎదుగుతున్నది. కరవుకాటకాలకు నెలవైన [[ఆఫ్రికా]] ఖండములో అహారోత్పత్తికి తోడ్పడుతూ, విశ్వవాణిజ్యవిపణి లో విలక్షణమైన ముద్రతో పెరుగుతున్న ఈ సంస్థ ఒక సామాన్య కర్షకుని పట్టుదలకు, శ్రమకు, భూమిని నమ్ముకొని జీవించే తత్వానికీ ఒక ఉదాహరణ.
 
==వదాన్యత==
సూర్యారావు గొప్పదాత. [[రాయచూరు]]లో ఆసుపత్రి, త్రాగునీటి పధకాలు, రైతుల కోసం పురుగు మందుల పరీక్షాశాల, [[ఇథియోపియా]] లోని పల్లెలలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించాడు. [[తిరుమల తిరుపతి దేవస్థానము]]లో నిత్య అన్నదాన పధకానికి లక్షల రూపాయలు దానం చేశాడు. ప్రతి సంవత్సరము జనవరి 17వ తేదీన వేలాదిమంది ప్రజలకు ఉచిత వస్త్రదానము, భోజనము కల్పిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/కరుటూరి_సూర్యారావు" నుండి వెలికితీశారు