ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''ఎస్.జానకి''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా [[మలయాళం]], [[కన్నడ]] బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
 
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు [[ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం]]తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. [[తమిళనాడు]] ప్రభుత్వం [[కలైమామణి పురస్కారం]] పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
పంక్తి 22:
 
==జననం మరియు బాల్యం ==
జానకి [[గుంటూరు జిల్లా]], రేపల్లె తాలూకా, [[పల్లపట్ల]] గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, [[ఆయుర్వేద వైద్యుడు]]. ఉద్యోగ రీత్యా ఈయన [[కరీంనగర్‌ జిల్లా]]లోని [[సిరిసిల్ల]]లో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. [[లతా మంగేష్కర్]], [[పి.సుశీల]], [[జిక్కి]], [[పి.లీల]] పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. [[నాదస్వరం]] విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, [[చెన్నై]]లోని [[ఏవీయం స్టూడియో]]లో పాడటం ఆరంభించిన జానకి [[మద్రాసు]]కు మారింది.
 
==గాయనిగా తొలినాళ్ళు==
తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో [[టి.చలపతిరావు]] [[సంగీత దర్శకత్వం]]లో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]] మరియు [[కన్నడ]] మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు మరియు సంగీత [[దర్శకురాలు]] కూడా. [[కృష్ణుడు|కృష్ణుని]] మరియు [[సాయిబాబా]] భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక [[మీరా]] పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసినది. [[ఉషా కిరణ్ మూవీస్]] వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది.
 
పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. [[పదహారేళ్ళ వయసు]] చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.
 
ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌... కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.
 
[[హిందీ]], [[సింహళం]], [[బెంగాలి]], [[ఒరియా]], [[ఇంగ్లీషు]], [[సంస్కృతం]], [[తుళు]], [[సౌరాష్ట్ర]], [[జపనీస్]], [[జర్మన్]] భాషలు తెలిసిన జానకి, [[ఘంటసాల]], డాక్టర్ రాజ్‌కుమార్, [[వాణి జయరాం]], [[కె.జె. జేసుదాస్]], [[ఎల్.ఆర్. ఈశ్వరి]], పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, [[ఇళయరాజా]], [[ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం]] వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.
 
==విశేషాలు==
*నీ లీల పాడెద దేవా...అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది.
*జానకి కొంతకాలం సిరిసిల్లలో[[సిరిసిల్ల]]లో, రాజమండ్రిలో[[రాజమండ్రి]]లో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
*భారతీయ గాయనిలలో యస్, జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందినది.
*జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు