జగదేకవీరుని కథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →కథాగమనం |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 102:
=== పాట వెనుక కథ ===
'''శివశంకరీ...శివానందలహరి''' పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట [[రచయత]] [[పింగళి నాగేంద్రరావు]], స్వరకర్త [[పెండ్యాల]], గాత్రం అందించిన [[ఘంటసాల]], దర్శకుడు [[కె.వి.రెడ్డి]]ల సమష్టి కృషి ఫలితమే ''శివశంకరీ'' పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న [[నందమూరి తారకరామారావు]] వెండితెరపై తన నటనతో జీవంపోశాడు.
దర్శకుడు కె.వి.రెడ్డి అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్, చిత్రీకరణ పూర్తి చేశాడు. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. [[కథానాయకుడు]] తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘''మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్సేన్, ఓంకారనాథ్ ఠాగూర్ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు [[హనుమంతుడు]] పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్" సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి''’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘''ట్యూన్ మనం సొంతంగానే చేద్దాం''’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల పూర్తి పాట రాసిచ్చాడు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో [[పెండ్యాల]] ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]కు వినిపించాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని [[రిహార్సల్స్]] అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్ కూడా పూర్తయింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్ చేసాడు. పాట చిత్రీకరణ సెట్స్ మీదకు వచ్చింది. ఎన్టీఆర్ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది.
ఈ పాట తెలుగు ప్రేక్షకులమీద చూపిన ప్రభావానికి ఒక ఉదాహరణ. డెబ్భయ్యవ దశకంలో రేపు (సి.నరసింహారావు) అనే పేరుతో ఒక మనోవైజ్ఞానిక పత్రిక వచ్చేది. అందులో ఒక పాఠకుడు శివశంకరీ పాట వింటుంటే కలిగే అనుభూతులు వివరించాడు. అతనికి నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు,సినీమా,సంగీతంతో సహా జరుగుతున్నట్టు, తను ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని అనుభూతి చెందేవాడట.
==వనరులు==
* [http://www.telugupeople.com/cinema/content.asp?contentId=2276 http://www.telugupeople.com/ వ్యాసం]
|