వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (2), లు → లు (3), తో → తో , సాంప్రదాయా → సంప్ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి''' ([[జూలై 8]], [[1949]] - [[సెప్టెంబర్ 2]], [[2009]]) [[ఆంధ్ర ప్రదేశ్]] 16వ ముఖ్యమంత్రి, [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు.
 
[[1978]]లో తొలిసారిగా [[పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం]]నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు [[పులివెందుల]] నుంచి ఎన్నికకాగా, 4 సార్లు [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి [[పార్లమెంటు]]లో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య [[ముఖ్యమంత్రి]] పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. [[1999]]లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. [[2003]]లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు <ref>http://www.kadapa.info/ysr.html</ref> సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. [[2004]] ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన [[సెప్టెంబర్ 2]], [[2009]]న [[చిత్తూరు జిల్లాలోజిల్లా]]లో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా<ref>ఈనాడు 26-05-2012</ref> అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. "క్విడ్ ప్రో కో " రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==