వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
==క్రైస్తవ్యం==
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన [[ప్రొటెస్టెంటు]] క్రైస్తవుడు. ఈయన తాత [[బ్రిటీషు]] మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని<ref>http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm</ref><ref>http://specials.rediff.com/election/2004/may/12sld3.htm</ref>, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ [[బర్మా]]లో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం [[పులివెందల]]లోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా [[బెత్లహాము]]యాత్రకు వెళ్ళివచ్చాడు.<ref>http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm</ref> క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన [[హిందూ]] సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను[[తిరుమల]]ను అనేకమార్లు సందర్శించి [[వెంకటేశ్వరస్వామి]] దర్శనం చేసుకొని [[పూజలు]] చేశాడు.<ref>http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm</ref><ref>http://www.hindu.com/2009/02/04/stories/2009020450910200.htm</ref><ref>http://www.hindu.com/2009/09/05/stories/2009090559220400.htm</ref> అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు.<ref>http://www.haindavakeralam.com/HkPage.aspx?PAGEID=9124&SKIN=B</ref> ఈయన అల్లుడు [[అనిల్ కుమార్]] మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత [[క్రైస్తవం]] స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.
 
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==