బలిజేపల్లి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] తాలూకా [[ఇటికంపాడు]]లో [[23 డిసెంబర్]], [[1881]] సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి మరియు ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ [[భాగవతుల చెన్నకృష్ణయ్య]] వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, [[కవిత్వం]] చెప్పడం నేర్చుకున్నారు.
 
[[కర్నూలు]]లో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి [[అవధానాలు]] ప్రదర్శించారు.
 
[[చల్లపల్లి రాజా]]వారి సాయంతో 1922లో [[గుంటూరు]]లో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని [[జైలు]] శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో [[గుంటూరు]]లో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో [[నక్షత్రకుడు]] పాత్ర వీరికిష్టమైనది.
 
తర్వాత కాలంలో [[చిత్తజల్లు పుల్లయ్య]] గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, [[పాటలు]] రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.