జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు, → , ) → ) using AWB
పంక్తి 41:
 
==విద్య, ఉద్యోగం==
కరుణశ్రీ [[గుంటూరు జిల్లా]], [[పెదనందిపాడు]] మండలములోని కొమ్మూరు గ్రామములో [[1912]], [[ఆగస్టు 4]]న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాగధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై [[అమరావతి]] రామకృష్ణ విద్యాపీఠములోనూ, [[గుంటూరు]] స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేశారు.
వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. [[ఉదయశ్రీ]], విజయశ్రీ, [[కరుణశ్రీ]], ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, [[పుష్పవిలాపం]] (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. [[జూన్‌ 22]], [[1992]]లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు.
 
 
 
==రచనలు==