కంచి వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==పత్రికా రంగం==
ఆయన 1957లో [[కృష్ణా పత్రిక]] కు సబ్ ఎడిటరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌]]<nowiki/>లో పనిచేశారు. తరువాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, [[కమ్యూనిజం]], [[హిందూయిజం]], [[గాంధీయిజం]] గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు [[కథలు]], మూడు [[నవలలు]] రచించారు. వాటిలో "శాపగ్రస్తులు" నవల పాఠకాదరణ పొందినది. ఆయనకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు తెచ్చింది. 1957 నుండి 1967 వరకు "[[చుక్కాని]]" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన "సమాచారం" పత్రికలో కొంతకాలం పనిచేసారు. 1976 నుంచి 1988 వరకు [[ఈనాడు]] [[విశాఖపట్నం]] యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా[[సబ్‌ఎడిటర్‌]]గా పనిచేసి పదవీ విరమణ చేశారు.<ref name=vasudevarao/>
 
ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.
"https://te.wikipedia.org/wiki/కంచి_వాసుదేవరావు" నుండి వెలికితీశారు