శేషేంద్రశర్మ మే 30, 2007వ తేదీ రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. కడసారి దర్శించేందుకు వీలుగా శేషేంద్ర భౌతిక కాయాన్ని ఆయన నివాసమైన పాన్మండీలోని[[పాన్మండీ]]లోని ధన్రాజ్గిరి ప్యాలెస్లో ఉంచారు. ఆయన భౌతిక కాయానికి మే 31న [[అంబర్పేట]] శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. [[పోలీసులు]] మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. ఈ కార్యక్రమానికి అనేకమంది సాహితీప్రియులు, అధికారులు, రాజకీయవేత్తలు, సామాజిక సేవాసంస్థల ప్రతినిధులు హాజరైనారు. శేషేంద్ర మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.