ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
ఎలకూచి బాల సరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన [[జటప్రోలు సంస్థానము]]లోనే. [[నెల్లూరు]] జిల్లా [[పొదిలి]] తాలుకాలోని [[ఎడవిల్లి అగ్రహారం]] వీరి జన్మస్థానం<ref>ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం,10వ సంపుటం,నాయకరాజుల యుగం-1, ఎమెస్కో,మద్రాస్,1966, పేజి-29</ref>. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం [[విజయనగరం]]లో గడిపారు. తరువాత [[తెలంగాణ]]లోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు.
==సాహితీ ప్రస్థానం==
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు "ఎలకూచి వెంకటకృష్ణయ్య". [[బాల్యం]]లోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 20</ref> ఆరు భాషలలో పండితుడు. "షడ్భాషా వివరణము" అనే వీరి గ్రంథం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం,
ఇతనికి మహోపాధ్యాయ బిరుదము కలదు. అందువల్ల ఇతడు కవిగా కాక ఎక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాడు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయమను త్ర్యర్థికావ్యమున స్వవిషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
|