నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
===సంప్రదాయపద్థతి===
భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ. రైతు కుటుంబాలు వ్యవసాయంతో పాటు పశుపోషన కూడా చేయుదురు. నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాల వుత్పత్తి జరుగును. గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి, పెరుగును[[పెరుగు]]ను చిలికి పెరుగు నుండి వెన్న, మజ్జిగ తయారుచేయుదురు. పెరుగును నుండి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేయుదురు. సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో తీసుకొని సన్నని మంట క్రింద నెమ్మదిగా వేడిచేయుదురు (110-120<sup>0</sup>C). మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో, పొంగుతో వెన్నమరగటం ప్రారంభించును. వెన్నలో అధిక శాతంలో నీరు వుండటం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు వచ్చును. వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును. మరుగునప్పుడు ఎర్పడు పొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేయుదురు. తమలపాకులను[[తమలపాకు]]లను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును. వెన్నకరిగి, తేమ తొలగిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారును. ఇలా ఎర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు. నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు 68% వరకు వుండటం వలన గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి గడ్డకట్టును.
 
===పారిశ్రామిక పద్థతి===
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు