కొత్త సచ్చిదానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''కొత్త సచ్చిదానందమూర్తి''' ([[ఆంగ్లం]]: Kotha Satchidananda Murty) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. [[బౌద్ధమతము]]పై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు<ref>నాగార్జున: Murty, K. Satchidananda. 1971. Nagarjuna. National Book Trust, New Delhi. 2nd edition: 1978</ref>. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, [[పద్మవిభూషణ్]] ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి. నలుగురు కుమారులున్నారు.
==బాల్యం==
[[గుంటూరు]] జిల్లా [[సంగం జాగర్లమూడి]]లో [[1924]] లో కొత్త వీరభద్రయ్య, రాజరత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆచార్య సచ్చిదానందమూర్తి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. [[మాతృభాష]]తో పాటు [[సంస్కృతం]], [[హిందీ]] భాషల్లో ప్రావీణ్యం సాధించారు. [[సంగం జాగర్లమూడి]]లో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత [[గుంటూరు]] [[ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోకళాశాల]]లో ఇంటర్‌ చదివారు. ఆంధ్రా[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] (వాల్తేరు)లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే తత్వశాస్త్రంలో పి.హెచ్‌.డి. పూర్తిచేశారు.అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. [[టిబెట్‌]] వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
==ప్రొఫెసర్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి==
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో [[పి.హెచ్‌.డి]]. పూర్తిచేసిన మూర్తి 1959లో [[అమెరికా]]లోని [[ప్రిన్సిటన్‌]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన [[ఆంధ్ర విశ్వ విద్యాలయం]]లో ఆచార్యునిగా చేరారు. 1963లో [[బీజింగ్‌]]లోని [[చైనా పీపుల్స్‌ విశ్వవిద్యాలయం]] ఆచార్యుని‌గా పనిచేశారు. మధ్యలో జె.ఎన్‌.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు [[వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], [[ఆసియా]], [[యూరప్‌]] దేశాల్లో పర్యటించారు. [[ఇంగ్లండు]]లోని [[ఆక్స్‌ఫర్డ్‌]], కేంబ్రిడ్జి[[కేంబ్రిడ్]]జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
 
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: [[టిబెట్‌]]తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్‌ స్టడీస్‌ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
పంక్తి 51:
 
==సర్వేపల్లి వారసుడు==
భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్‌ [[సర్వేపల్లి రాధాకృష్ణన్‌]] ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్‌ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే. సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్‌ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు [[ఢిల్లీ]]కి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. పాఠశాల, కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి, [[పీహెచ్‌డీ]] అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దికాలం అధ్యాపక వృత్తి స్వీకరించారు. తర్వాత ఆచార్యుడిగా మయూర్‌భంజ్‌లో పనిచేశారు. 1959లో అమెరికాలోని[[అమెరికా]]లోని ప్రిన్సిటన్‌ యూనివర్శిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు. 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా, సారనాథ్‌లోని[[సారనాథ్‌]]లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌ సంస్థకు ఛాన్సలర్‌ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు.
 
==బిరుదులు==