ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
== ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం ==
[[File:Statue subbalaxmi 4.JPG|thumb|left|ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో]]
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి [[కుంకుమబొట్టు]], చేతుల నిండా [[గాజులు]], కళ్లకు నిండుగా [[కాటుక]], [[కొప్పు]], కొప్పు నిండా [[మల్లెపూలు]], చేతిలో [[తంబూర]] పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. [[కర్ణాటక సంగీతం]]లో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, [[జానపద గేయాలు]], మరాఠీలో[[మరాఠీ]]లో [[అభంగాలు]], దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన [[సంస్కృత]] భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. [[త్యాగరాజు]], [[ముత్తుస్వామి దీక్షితార్]], [[శ్యామశాస్త్రి]] వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
 
[[మహాత్మా గాంధీ]]కి ఎంతో ఇష్టమైన ''వైష్ణవ జనతో'', ''జె పీర్ పరాయీ జానేరే'' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని [[మహాత్మా గాంధీ]] ఆమెను ప్రశంసించారు.