ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 49:
== ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం ==
[[File:Statue subbalaxmi 4.JPG|thumb|left|ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో]]
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి [[కుంకుమబొట్టు]], చేతుల నిండా [[గాజులు]], కళ్లకు నిండుగా [[కాటుక]], [[కొప్పు]], కొప్పు నిండా [[మల్లెపూలు]], చేతిలో [[తంబూర]] పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. [[కర్ణాటక సంగీతం]]లో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, [[జానపద గేయాలు]],
[[మహాత్మా గాంధీ]]కి ఎంతో ఇష్టమైన ''వైష్ణవ జనతో'', ''జె పీర్ పరాయీ జానేరే'' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని [[మహాత్మా గాంధీ]] ఆమెను ప్రశంసించారు.
|