వేంకట రామకృష్ణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Venkataramakrishnakavulu.jpg|right|200px|thumb]]
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]] పేజీలు 295-307]</ref>,<ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0061/724&first=1&last=516&barcode=2990100061719 పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ - సి.కమలా అనార్కలి - పేజీలు: 341-352]</ref>. వీరు 1909 సంవత్సరములో పిఠాపుర సంస్థానంలో ప్రవేశించారు. నాటికి [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] వయస్సు 26 సంవత్సరాలు. [[వేదుల రామకృష్ణశాస్త్రి]] 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] ఈ కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి [[అవధానము]] చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన [[పిఠాపురం]] సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు. వీరు ఆ సంస్థానంలో [[శతావధానము]], శతవిధానము [గంటకు 100 పద్యాలు చెప్పుట], శత ప్రాసము [ఒకేప్రాసతో 100 పాదాలు గంటలో చెప్పుట], [[అష్టావధానము]] మొదలైనవాటిని నిర్వహించి పండితుల, ప్రభువుల మెప్పు పొందారు. వీరు పిఠాపుర సంస్థానంలో ప్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన [[తిరుపతి వేంకటకవులు|తిరుపతి వేంకటకవుల]]తో వాగ్యుద్ధం తటస్థించింది. రామకృష్ణకవులు వయసున చిన్నవారైనా ఆ కవుల కృతులలోని దోషాలను బయట బెట్టి 'శతఘ్ని' అనే ఖండన గ్రంథాన్ని ప్రకటించారు. ఈ వివాదం మొదట చక్కని కృతి విమర్శలతో ప్రారంభమై క్రమక్రమంగా శ్రుతి మించి వ్యక్తిదూషణలకు దారితీసింది. ఏదిఏమైనా ఆనాటి ఈ వివాదం సాహిత్యప్రియులకు మంచి కాలక్షేపాన్ని కలిగించింది. ఈ వాక్సమరంలో దేశము లోని పండిత కవులెందఱో కలుగ చేసికొని పైకి వచ్చారు. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టం. ఈ వివాదారంభంలో [[కవిత (మాసపత్రిక)|కవిత]] అనే మాసపత్రికను వీరు నెలకొల్పారు. ఈ పత్రిక తొమ్మిది ఏండ్లు అవిచ్ఛిన్నంగా సాగింది.
==అవధానాలు==
వీరు అవధానాలలో అత్యద్భుత శతావధానం, శతవిధానం, శతప్రాసం, ద్విగుణీకృత [[అష్టావధానం]] అనే వినూత్న ప్రయోగాలు ప్రవేశపెట్టి తమ ప్రత్యేకతను చాటుకొన్నారు. వీరు [[యానాం]] మహాలక్ష్మి సంస్థానంలో ఒక శతావధానం, [[పిఠాపురం]] సంస్థానంలో రెండు అష్టావధానాలు జంటగా చేయగా, వేదుల రామకృష్ణశాస్త్రి కాకరపర్రులో[[కాకరపర్రు]]లో ఒక అష్టావధానం, పల్లిపాలెంలో[[పల్లిపాలెం]]లో రెండు అష్టావధానాలు చేశాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=138-141|edition=ప్రథమ|accessdate=19 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరి అవధాన పద్యాలు మచ్చుకు: