31,174
edits
(+ఇతరవాడుకలు) |
(అచ్చుతప్పుల సవరణ +లింకులు) |
||
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[భీష్ముడు|భీష్ముని]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది. అభిమన్యుని మరణ సమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త, సైంధవుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునిని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతిన చేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.
[[వర్గం:మహాభారతం]]
|
edits