తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధుడు.
==బాల్యము, విద్యాభ్యాసము==
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి గారు ఒకడు. ఇతడు [[మహబూబ్నగర్ జిల్లా]], [[కోడేరు]] మండలం, [[రాజాపురం (కోడేరు)|రాజాపురం]] గ్రామంలో [[డిసెంబర్ 6]]న, [[1902]]లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు<ref>[http://namasthetelangaana.com/Editpage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=437119 మన కవి కుల తిలకం - - సంబరాజు రవిప్రకాశరావు] </ref>. ఇంటి దగ్గరే వేదవిద్యను అభ్యసించి ఆ తరువాత [[వనపర్తి]], [[కర్నూలు]], [[శ్రీకాళహస్తి]], [[ఆకిరిపల్లి]], [[చిట్టిగూడూరు]], [[బందరు]]లలో ఎంతో మంది పండితప్రకాండుల వద్ద సుమారు పన్నెండేళ్లు [[సంస్కృత]] విద్యను అభ్యసించాడు.
==ఉద్యోగ ప్రస్థానం==
తాను చదువుకొన్న [[బందరు]] [[జాతీయ కళాశాల]]లో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. [[కర్నూలు]]లో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతనికి సహాధ్యాయి. [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో [[బెజవాడ]]లో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి [[గద్వాల]] రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. [[గద్వాల]] రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇతడు 1959లో [[రాజాపురం]] గ్రామానికి మొదటి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు.
==బహుముఖ ప్రతిభ==
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక
==సాహిత్య రంగం==
1922- 23 సంవత్సరం నుంచి ఇతని సాహిత్య ప్రస్థానం ప్రారంభమైనది. ఇతని మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని ఇతడు [[బందరు]]లో ఉన్నప్పుడే రచించాడు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరము అను ఖండకావ్యాన్ని చెప్పాడు. ఇది 1926లో ముద్రించబడినది.
[[శృంగేరీ]] పీఠానికి వెళ్లి అక్కడ
తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవితలు, సాహిత్యోపన్యాసాలు
==సన్మానాలు==
ఇతడు [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[కొల్లాపూర్|కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, [[శృంగేరి]], [[పరకాల]], [[పుష్పగిరి]], మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు. 1974లో [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనాడు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా ఇతడిని సత్కరించింది.
==బిరుదులు==
|