శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
[[బొమ్మ:SrISrI text.jpg|right|250px|శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై]]
=== బాల్యం, విద్యాభ్యాసం ===
'''శ్రీశ్రీ''' - '''శ్రీరంగం శ్రీనివాసరావు''' - [[1910]] సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా ఆయన ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, [[1910]] న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. [[విశాఖపట్నం]] పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30, 1910 అని విరసం వారు స్పష్టీకరించారు.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref> శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో చేసాడు. [[1925]]లో [[SSLC]] పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో [[మద్రాసు]] విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
 
[[1935]]లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. [[1938]]లో మద్రాసు [[ఆంధ్ర ప్రభలోప్రభ]]లో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత [[ఆకాశవాణి]], [[ఢిల్లీ]] లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, [[ఆంధ్ర వాణి]] పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. [[1933]] నుండి [[1940]] వరకు ఆయన రాసిన [[మహాప్రస్థానం]], జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
 
[[1947]]లో [[మద్రాసు]]కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత [[1949]]లో ఒక బాలికను [[దత్తత]] తీసుకున్నాడు. [[1956]]లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
 
[[1955]] సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. [[1969]]లో ప్రత్యేక [[తెలంగాణా]] ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ [[వావిలాల గోపాలకృష్ణయ్య]]తో కలిసి [[ఖమ్మం]]లో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
 
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "[[రాజా లక్ష్మీ ఫౌండేషను]]" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి ([[అరసం]]) అధ్యక్షుడిగా పనిచేసాడు. [[1970]]లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం ([[విరసం]]) ఏర్పడింది.
 
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై [[1983]] [[జూన్ 15]] న శ్రీశ్రీ మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు