బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
అలివేలమ్మ కమలా నెహ్రూతో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.<ref>[http://www.prabhanews.com/leaders/article-233728 స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011]</ref> విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన నాయకురాలు బారు అలివేలమ్మ.
== సంస్మరణ ==
ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని[[రాజమండ్రి]]లోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.<ref>http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html</ref> ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి సబ్ కలెక్టర్ వి.శేషాద్రి ఆవిష్కరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు