తిరుమల రామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''తిరుమల రామచంద్ర''' సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర [[మాతృభాష]] తెలుగుతో పాటు [[కన్నడ]], [[తమిళ]], [[సంస్కృతసంస్కృతం]], ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
[[అనంతపురం జిల్లా]] [[ధర్మవరం]] తాలూకా [[రేగటిపల్లె]] లో జన్మించిన రామచంద్ర [[హంపీ]] శిథిలాలలోని గ్రామమైన [[కమలాపురం]]లో తన బాల్యం గడిపారు. వీరు సాక్షాత్తూ విజయనగరసామ్రాజ్యంలో[[విజయనగరసామ్రాజ్యం]]లో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల [[తిరుపతి]]లోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.
 
== ఉద్యమరంగం ==
పంక్తి 51:
[[వేటూరి ప్రభాకర శాస్త్రి]]కి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర [[విద్వాన్ విశ్వం]] వంటి సహాధ్యాయులతో పనిచేశాడు. అనంతరం [[ఢిల్లీ]] వచ్చి [[డెయిలీ టెలిగ్రాఫ్]] [[ఆంగ్ల]] పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశాడు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేసి తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు [[అడవి బాపిరాజు]] శిష్యరికంలో రాటుదేలాడు.
 
[[సురవరం ప్రతాపరెడ్డి]], [[రావి నారాయణ రెడ్డి]] , [[బద్దం ఎల్లారెడ్డి]], ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]],[[ఆంధ్రభూమి]],[[హిందుస్తాన్ సమాచార్]] లలో వివిధ హోదాలలో పనిచేశాడు. [[భారతి మాసపత్రిక]] ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో [[దేవరకోండ బాలగంగాధర తిలక్]] వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. [[నార్ల వెంకటేశ్వరరావు]] తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.
 
[[పరిశోధన (పత్రిక)|పరిశోధన]] అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.
"https://te.wikipedia.org/wiki/తిరుమల_రామచంద్ర" నుండి వెలికితీశారు