మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''మింటో-మార్లే సంస్కరణలు''' 1909
==పూర్వోత్తర సందర్భం (Background)==
1909సంవత్సరములో చేసిన మింటో మార్లే సంస్కరణలు భారతదేశములోని బ్రిటిష్ ఇండియా చరిత్రలోని ఒక ప్రముఖమైన అంశం. 1907-1908 మధ్యకాలంలో అనేక రాష్ట్రములలో ముఖ్యముగా వంగ రాష్ట్రములోనూ, పంజాబులోనూ దేశాభిమానము విప్లవమార్గం పట్టి విప్లవోద్యమ పరిస్థితులు చాల తీవ్రముగా విఝృంభించాయి. అప్పుడు ఉగ్రవాదములనణుచుటకు బ్రిటిష్ ప్రభుత్వమువారు చేపట్టిన అనేక ప్రతి క్రియలలో నేరముల ప్రోత్సాహ చట్టము ప్రయోగించి పత్రికలను మూతవేశారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను (ఉదాహరణ [[లాలా లజపతిరాయ్]]) 1818 రెగ్యులేషన్ క్రింద న్యాయవిచారణలేకనే జైలులో నిర్భందించి, ప్రవాసములపంపిచారు. అటువంటి అత్యవసర రెగ్యులేషనలను అమలుచేసి బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రజల స్వేచ్ఛా స్వతం త్య్రములను నాశనముచేసి, ప్రజాభిప్రాయము నణగత్రొక్కటానికి తీవ్ర నిర్భందములకు గురిచేయుచుండిరి. ఆ పరిస్థితులు స్వరాజ్యకాంక్షించు మితవాదులకే కాక బ్రిటిష్ ప్రభుభక్తులను గూడా వ్యాకలవ్యాకుల పరిచినవి. వారిని బుజ్జగించి చేరదీయుటకు గౌరవ బిరుదులు గౌరోద్యగములిచ్చి తృప్తిపరచదలచ టమే కాక శాసన పూర్వకమైన సంస్కరణలమవసరమని తలచి చట్టము తయారు చేశారు. ఆ 1909 ఇండియా రాజ్యాంగ చట్టములో కలిగియున్న కొన్ని సంస్కరణలు మింటో-మార్లే సంస్కరణలని ప్రసిద్ది.
 
===19వ శతాబ్దమునందలి బ్రిటిష్ ఇండియాలోచేసిన రాజ్యాంగ సంస్కరణలు ప్రజాపరిపాలనా విధానముల సింహవలోకనం ===
1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టము ( చూడు [[1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము]] ) తరువాత 1892లో మరో రాజ్యాంగ చట్టము చేసి తద్వారా ప్రజాపరిపాలనా విధానములనబడునవి ప్రవేశపెట్టబడినవి. ఈ1892వ సంవత్సరపు చట్టము వలన కలిగిన పురోగమనమేమనగా కేంద్రశాసనసభలలోిని సభ్యులు పూర్తిగా 100% నియమించబడినవారుగాక కొంతమంది అభ్యర్ధులగా నిలబడి ఎన్నికలో గెలుపొందినవారుగానుండిరి. నిరంకుశముగా పరిపాలింపబడుచున్న బ్రిటిష్ ఇండియాలో ఇది ప్రజాపరిపాలనావిధానమువైపు పురోగతియని చెప్పాలి.. .........సశేషం <ref name= "Dilip Hiro">"the Longest August" Dilip Hiro (2015) Naton Books
pp6-7</ref>
 
== 1909 సంవత్సరపు రాజ్యాంగ చట్టము నందలి నిష్ప్రయోజక సంస్కరణలు వాటి ఫలస్వరూపము ==