కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
== ప్రయాణం ==
[[Image:NASA-GNT.jpg|right|thumb|250px|కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం]]
ద్వీపకల్పం పడమర చివరిp నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో [[కొయినా]] నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత '''వర్ణ''', '''పంచగంగ''', '''దూధ్‌గంగ''' లు కలుస్తాయి. [[మహారాష్మహారాష్ట్ర]]ట్రలోలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక [[బెల్గాం]] జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద [[కర్ణాటక రాష్ట్రం]]లోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో'''ఘటప్రభ''', '''మాలప్రభ''' నదులు కృష్ణలో కలుస్తాయి. [[తెలంగాణ]] రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, '''భీమ''' నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి [[రాయచూర్]] జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, [[మహబూబ్‌నగర్]] జిల్లా [[తంగడి]] వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత [[ఆలంపూర్]]కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది [[తుంగభద్ర]] కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది [[నల్లమల]] కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే [[శ్రీశైలం]], [[నాగార్జున సాగర్]] ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన [[దిండి]], [[ మూసి]] , [[పాలేరు]], [[మున్నేరు]] వంటివి కలుస్తాయి. [[విజయవాడ]] వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ [[ప్రకాశం బ్యారేజి]]ని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. [[విజయవాడ]] వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని [[హంసల దీవి]] వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
 
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2, 56, 000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు