తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లిపెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లిపెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెండ్లికానిపెళ్ళికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు.