అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ లింకు |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →బాల్యం |
||
పంక్తి 23:
== బాల్యం ==
[[1933]] [[నవంబర్ 3]]న
== కుటుంబము ==
సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగము చరిత్రలో పండితుడు. అతను [[రవీంద్రనాథ్ టాగూర్]]కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి [[ఢాకా]] విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి ''లిటిల్ మ్యాగజీన్''ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీతలు 1971 లో [[లండన్]] కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.
సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985 లో అమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది. సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ [[న్యూయార్క్]] లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
== అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా ==
Ph.D. పూర్తికాగానే [[కోల్కత]] విశ్వవిద్యాలయంలోనూ, [[ఢిల్లీ]]లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు.
పంక్తి 34:
[[1960]]లో నవనీత దేవి అనే బెంగాలీ కవియిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతర, నందన అనే పిల్లలు కూడా కలిగినారు. [[1971]]లో వారు [[లండన్]] వెళ్ళిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలోర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973 లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో [[క్యాన్సర్]] వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పనిచేస్తున్న ఎమ్మా జార్జిన రూత్చైల్డ్స్.
== అర్థశాస్త్రంలో సేన్ కృషి ==
సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ [[సోషల్ ఛాయిస్]] అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు.[[1943]]లో బెంగాల్ లో [[కరువు]] సంభవించినప్పుడు అప్పటి [[బ్రిటీష్]] ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను [[అర్థశాస్త్రం|అర్థశాస్త్ర]] పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.
== సేన్ బోధనల్లోవిశేషాలు ==
* ప్రేమ పునాదిగా పంచబడే న్యాయం ఒడంబడిక ద్వారా పంచబడే న్యాయం కంటే విలువైనది
* [[అశోకుడు]] బుద్ధిస్టు సూత్రాలపై ఏర్పరచిన రాజ్యంలో 'ప్రజాసంక్షేమం బలంగా అంతర్లీనమై ఉంటుంది
* [[అక్బర్]] సెక్యులర్ న్యాయపునాదులు వేసిన రాజు సర్వమత సమానత్వ సూత్రీకరణను రూపొందించిన తాత్వికుడు.
*
== అవార్డులు ==
|