విమల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Story of the film is given. |
||
పంక్తి 1:
ఆనంతగిరి సంస్థానం యువరాజు విజయకుమార్ (రామారావు) లంక పర్యటనకు వెళ్ళినప్పుడు బందిపోటు ఉగ్రసింహుడి (రాజనాల) కి బందీగా చిక్కుతాడు. లక్ష రూపాయలు ఇస్తే, యువరాజును విడుదల చేస్తానని, విజయ్ బంటు ద్వారా సంస్థానానికి కబురు పంపుతాడు, ఉగ్రసింహుడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బంటు అడవిదారిలో కౄరమృగాల పాలబడి చనిపోతాడు. అనంతగిరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో, ఉగ్రసింహుడు యువరాజు విజయ్ చెవులు కత్తిరించి సంస్థానానికి పంపిస్తానని ఆ విధంగా డబ్బు రాబట్టు తానని వెళ్ళడించి, యువరాజు పెడరెక్కలు విరిచిపట్టుకోమని అనుచరులను ఆదేశిస్తాడు. ఆ సమయంలో విమల (సావిత్రి) విజయ్ ను బంధించిన గుహ వద్దకు వచ్చి, బందీలను విడుదల చేయవలసినదిగా ఉగ్రసింహుడిని అభ్యర్ధిస్తుంది. గతంలో తనను విమల పోలీసులనుంచి కాపాడినదన్న కృతజ్ఞతా భావంతో, ఉగ్రసింహుడు యువరాజును విడుదల చేస్తాడు. అస్వస్థుడిగా ఉన్న విజయ్ ను, విమల తన గృహానికి తీసికెళ్ళి సపర్యలు చేస్తుంది. యువరాజు విమలను ప్రేమిస్తాడు. విమల తండ్రి రాజేశ్వరప్రసాద్ (గుమ్మడి) తో విజయ్, విమలను వివాహం చేసుకోవాలన్న తన అకాంషను వెళ్ళడిస్తాడు. విమల ఒక అంటరాని స్త్రీ అని, విజయ్ రాజవంశపు రాకుమారిని వివాహం చేసుకోవాలని రాజేశ్వరప్రసాద్ తన మాటగా చెప్పి, వారిని మరువాలని యువరాజుని అభ్యర్ధిస్తాడు. మనసు నిండా విమలపై ప్రేమ నింపుకుని, యువరాజు అనంతగిరి వెళ్తాడు.
విమల ఒక సాయంత్రం తోటలో ఉన్నప్పుడు ఉగ్రసింహుడు వచ్చి తన ప్రేమను వ్యక్త పరిచి, తనను వివాహం చేసుకోవాలని తన మనసులోని మాట బయటపెడ్తాడు. విమల ఈ విషయాన్ని తన తండ్రితో చెపుతుంది. ఉగ్రసింహుదు చాల కౄరుడని, అతని నుంచి తమకు హాని కలుగుతుందని, విమల, రాజేశ్వరప్రసాద్ ఒక పడవలో పరిపొయే ప్రయత్నంలో, ప్రమాదవశాత్తూ విడిపోతారు. సముద్రపు ఒడ్డున స్పృహలేని స్థితిలో ఉన్న విమలను, అనంతగిరి సంస్థానపు రాణి రాజ్యలక్ష్మి (సంధ్య) గమనించి, ఆమెను రక్షించి, తన ఆస్థానానికి తీసుకెళ్తుంది. స్పృహ వచ్చాక రాజ్యలక్ష్మే తన తల్లి అని లలితకుమారి (విమల అసలు పేరు) గుర్తిస్తుంది కాని, ఆ విషయాన్ని గోప్యంగా వుంచుతుంది. రాజేశ్వరప్రసాద్, వారి అన్నగారు అనంతగిరి సంస్థానపు రాజులు. పెద్దరాజావారు అవిటివాడు కావటంతో చిన్నరాజావారే సంస్థానం మంచి చెడులు, పాలన నిర్వహించేవారు. ఒకరోజు పెద్దరాజావారు, చిన్నరాజావారు ఎదో విషయంలో విభేదిస్తారు. మరుసటిరోజే పెదరాజావారి హత్య జరుగుతుంది. రాజేశ్వరప్రసాద్ పై హత్యానేరం ఆపాదింపబడి, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తి రాజేశ్వరప్రసాద్ కు ఉరిశిక్ష వేస్తాడు. జైలు నుంచి తప్పించుకుని రాజేశ్వరప్రసాద్ , లలితకుమారిని తనతో తీసుకుని లంకకు పారిపోతాడు. తనపై హత్యానేరం ఉంది కనుక రాజేశ్వరప్రసాద్ తమ విషయాలను ఎవరికీ చెప్పవద్దని విమలతో చెప్తాడు. విమలను ప్రేమించిన యువరాజు విజయ్, రాజ్యలక్ష్మి తమ్ముడే. ఈ నేపధ్యంలో విమల, యువరాజు తో తాను వివాహం చేసుకోలేదని రాజ్యలక్ష్మితో చెప్తుంది.
విమల మనోవేదన అర్థం చేసుకున్న విజయ్ పెదరాజావారిని ఎవరు హత్యచేసారన్న విషయం పై, విమల సాగిస్తున్న గూఢచారి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ, చివరకు అసలు హంతకులను పట్టుకుంటారు. ఎలాగైనా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్న దుష్ట కోరికతో ఉన్న, ఇంటిదొంగలైన, హంతకుడు రాజా అప్పలరాయుడు బహద్దూర్ ను, అతనికి సహకారం అందించిన వెంకటప్పయ్య (రమణారెడ్డి), బట్లర్ (రేలంగి) లను పట్టుకోవడముతో, రాజేశ్వరప్రసాద్ అజ్ఞాతం ముగుస్తుంది. లలితకుమారి, యువరాజు విజయ్ కుమార్ ల వివాహం తో కథ సుఖాంతం.{{సినిమా|
name = విమల |
image = Vimala film.jpg |
|