ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎కబ్జా కోరల్లో ఫిరంగి నాలా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB
పంక్తి 40:
[[File:Anadaasramam inside. Ibrahimpatna.jpg|thumb|left|వృద్ధాశ్రమములోపలి ప్రాంగణము, ఇబ్రహీం పట్నం.]]
[[File:Mandal parishat office, ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం, మండలపరిషత్ కార్యాలయము]]
చెరువూ నీటితో నిండి అలుగు ద్వారా వృథాగా పారే నీటిని ఫిరింగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సంమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దీని వల్ల వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశం ఏర్పడడంతో రైతులకు ఉపాధి ఏర్పడింది. దీంతో పాటే కాలువ పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు సమస్యను శాశ్వతంగా తీర్చేవీలు ఏర్పడింది. ఫిరంగి కాలువతో షాబాద్‌ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్‌ పెద్ద చెరువు, శంషాబాద్‌ మండల పరిధలోని రామాంజపూర్‌ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువు, ఇంజాపూర్‌[[ఇంజాపూర్]]‌ చెరువు, తుర్కెంజాల్‌ సమీపంలోని కొత్త చెరువు, తుక్కుగూడ చెరువులతో పాటు ఇబ్రహీంపట్నం చెరువులను నీటితో నింపారు. నీటిని ఇబ్రహీంపట్నం చెరువుకు కాలువ ద్వారా చేరవేసేలోపే చందనవల్లి వద్ద నిర్మించిన కరకట్ట తెగిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని పెద్దలు చెబుతున్నారు. వేలాది ఎకరాలక సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులకు నీరందినట్లు తెలుస్తోంది. కాలువ పూడుకుపోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్‌ ఎస్టేట్‌ దెబ్బ తగిలింది. భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకులు ముందుచూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు కూడా నేడు కనుమరుగవుతున్నాయి.
[[File:Branch library, ibrahim patnam.jpg|thumb|left|ఇబ్రహీంపట్నం గ్రామములో శాఖ గ్రంథాలయము]]
[[File:Post office at ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం గ్రామములోని తపాలా కార్యాలయము]]