సైమన్ కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
వందేమాతరోద్యమకాలము (1907-1916) " బాల్ లాల్ పాల్ " అని ప్రసిద్దిగాంచి, బ్రిటిష్ ప్రభుత్వమువారిచే ప్రవాసమునకంపబడిన ముగ్గురు తీవ్రజాతీయవాదుల లో పంజాబ్ కేసరి అని ప్రసిధ్దిగాంచినట్టి [[లాలా లజపతిరాయ్]] 1927 సంవత్సరపు సైమన్ కమీషన్ నియామకమునకు తీవ్ర వ్యతిరేకతచూపెను. [[పంజాబ్]] శాసన సభలో సైమన్ విచారణ సంఘమును బహిష్కరించవలయునన్న తీర్మానము ప్రవేశపెట్టెను. సైమన్ కమిటీ సభ్యులు 1928 అక్టోబరు 30న లాహోర్ లో పర్యటించుచున్నప్పుడు లజపత రాయి నాయకత్వమున శాంతియుతముగా జరుగుచున్న నిరసన ప్రదర్శనలపై పోలీసు వారు జోక్యముచేసుకుని లాఠీ ప్రయోగముచేసెను. పోలీసు సూపరింటెండెంట్ స్కాట్ (James A. Scott) ఆదేశముల ప్రకారం ప్రత్యేకముగా లజపత రాయి పై దెబ్బలు కురిపించబడినవి. గాయపడియుండియూ లజపత రాయి నిరసన కార్యక్రమములు కొనసాగించి తదుపరికూడా బహిరంగ సభలలో ప్రసంగములుచేసి, సైమన్ గోబ్యాక్ (Simon go back) అను నినాదమును మారుమ్రోగించి లాఠీదెబ్బల ప్రభావమునుండి కోలుకొనలేక జబ్బుపడి చివరగా 1928 నవంబరు 17 తేదీన మరణించాడు. సైమన్ కమీషన్ భారతదేశ పర్యటన బ్రిటిష్ ఇండియా చరిత్రలోనూ, భారతదేశ స్వాతంత్రపోరాట చరిత్రాంశములోనూ ఒక ప్రముఖమైన ఘటన.
 
==బహిష్కరణోద్యమబహిష్కరోద్యమ ఫలితములు==
<br>
(1) బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పరిపాలన తిరస్కరించుతూ భారతదేశమునకు స్వపరిపాలిత రాజ్యాంగము కావలయునన్న ఆంకాంకక్ష ఏక కంఠముతో వెల్లడించటమైనది <br>
"https://te.wikipedia.org/wiki/సైమన్_కమిషన్" నుండి వెలికితీశారు