తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ రాధాకృష్ణ ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు రాధా కృష్ణుల ఉతవ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారు. ఉదయం ఆరాధన, రక్షాబంధనం తో పాటు, కలశాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించినారు. అనంతరం తీర్ధగోష్టి జరిగినది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. సాయంత్రం శ్రీరామానుజయ భక్త సమాజం చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం శ్రీ రాధకృష్ణుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేసినారు. రాత్రికి స్వామివారి ప్[అవళింపుసెవ మనోహరంగా సాగినది. [4]
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ [[కనకదుర్గమ్మ]] ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,[[ఆగష్టు]]-12 నుండి మొదలైన [[కృష్ణానది]] పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
#శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు