దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#శ్రీ ఏలేశ్వరస్వామివారి ఆలయం:- నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి కొండపైగట్టు ఉన్నది. ఈ గట్టు శ్రీశైలానికి ఈశాన్య ద్వారంగా ఉంటుంది. సాగర్ డ్యాం నిర్మాణం తరువాత ఈ గట్టు సగానికి పైగా నీటితో నిండి పోయినది. ఈ గట్టు జూలు విప్పి పడుకున్న సింహం ఆకారంలో ఉంటుంది. ఈ ఏలేశ్వరస్వామి గట్టుపై ఒక వేయి మీటర్ల లోతులో కాత్యాయని, మల్లిఖార్జునస్వామి, మాధవస్వామి, వినాయకుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో కోటి ఒక్క శిల, నూట ఒక్క గుడి, వేయి కవ్వములు ఆడినట్లు శాసనాలు చెప్పుచున్నవి. పూర్వం ఇక్కడ మహాశివరాత్రికి పదకొండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం దక్షిణ కాశి గా పేరుగాంచినది. ఈ గట్టుపై వెలసిన స్వామివారికిపురాతన శివాలయమైన ఈ ఏలేశ్వరస్వామివారికి, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి సందర్భంగా ఈ గట్టును నాలుగైదు వేలకుమందికి పైగా భక్తులు దర్శించుచుంటారు.ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు