రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Shankar1242 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Shankar1242 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6:
రేనాడు అని వ్యవహరింపబడిన ([[కడప]] మండలములోని [[పులివెందుల]], [[కమలాపురం]], [[ప్రొద్దుటూరు]], [[జమ్ములమడుగు]] తాలూకాలు, [[చిత్తూరు]] మండలములోని [[మదనపల్లి]], [[వాయల్పాడు]] తాలూకాలు) దేశ విభాగములో [[తెలుగు]] భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దము వరకు [[చోళులు|చోళవంశమునకు]] చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా [[ఏరువ]], [[పొత్తపి]], [[నెల్లూరు]], [[కొణిదెన]], [[నిడుగల్లు]], [[కందూరు]] అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. 7వ శతాబ్దములో పర్యటించిన [[హుఎన్ చాంగ్]] ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశము 16వ శతాబ్దినాటికి [[ఉదయగిరి]] [[పెనుగొండ]] దుర్గముల మధ్య అధిక భాగము ఆక్రమించి ఉన్నది.
ఈ వంశీయులు వేయించిన శాసనములు తెలుగుభాషలో నున్నవి. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనములు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కినది.వీరి శాసనములలో ఆంధ్రభాష స్థానమాక్రమించి, [[ప్రాకృత]] ప్రభావితమై, తెలుగు భాష ప్రాధమిక దశను సూచించును.ప్రాకృత పదములతో కలిసియున్న తెలుగు పదములు, వింతవింత రూపములతో కనిపించి, ఆంధ్రభాషావికాసమును పరిణామమును సూచించును.వీరి శాసనములలో ధనంజయుని కలమళ్ళ శాసనము మొదటి తెలుగు శాసనము క్రీ.శ.575 లో వేయింపబడినది. వీరి మొదటి నివాసమగు చోళనాడి తెలంగాణలోని నేటి నల్గొండ, మహబూబునగరు ప్రాంతమని కొందరి అభిప్రాయము.రేనాడు ఏడువేల దేశము.అనగా ఏడువేల గ్రామములున్న దేశము.రేనాటిని పాలించిరి గావున వీరు రేనాటి చోళులు అయినారు.వీరి శాసనముల ప్రకారము వీరు కరికాల చోడుని సంతతివారని, సూర్యవంశీయులని, కాశ్యపగోత్రీయులని తెలియుచున్నది.కడప మండలమును పాలించినవారు రేనాటి చోడులు.కాలక్రమమున వీరు పాకనాడను ఆక్రమించి చిన్న చిన్న కుటుంబములుగా చీలి, రాజ్యములను స్థాపించి పాలించినారు.వీరిలో రేనాడు, పాత్తపినాడు, కొణిదెన, నెల్లూరు ప్రాంతములను పాలించిన చోడవంశీయులు ప్రసిద్ధులు.
|