గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను (2), గా → గా , తో → తో (2), హైదరాబాద్ → హైద using AWB
పంక్తి 39:
 
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన [[గుత్తికొండ]] నరహరి [[ఆగస్టు 10]], [[1918]] న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు [[యలవర్రు]] గ్రామం, [[అమృతలూరు]] మండలం ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త [[యలవర్తి నాయుడమ్మ]] అక్కడివాడే. సమీపంలో వున్న [[తురుమెళ్ళ]] పాఠశాలలో చదువుకున్నాడు. [[యలవర్తి రోశయ్య]], [[మల్లంపాటి మధుసూదన ప్రసాద్]] తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే [[బర్మా]] లోని [[రంగూన్]] వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేసి, తిరిగి వచ్చి గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]]లో న్యాయశాస్త్రములో చేరి మధ్యలోనే స్వస్తిపలికి, [[ఎం.ఎన్.రాయ్]] ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయ్యాడు. 1944 లో [[గూడవల్లి]] లో, మేనమామ కూతురు సరోజినితో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడింది.
 
==రాజకీయాలు ==
1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. [[ములుకోల]], [[ప్రజామిత్ర]], [[సమీక్ష (పత్రిక)|సమీక్ష]] పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. [[విహారి]], [[ఆంధ్రా లేబరు]] పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. [[త్రిపురనేని గోపీచంద్|గోపీచంద్]], [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]], [[ఎం.వి.రామమూర్తి]], [[కోగంటి రాధాకృష్ణమూర్తి]], పి.వి.సుబ్బారావు, [[రావిపూడి వెంకటాద్రి]], [[ఎన్.వి.బ్రహ్మం]] లతో నవ్య మానవ వాద ఉద్యమంలో పనిచేశాడు. [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఎ.సి.కాలేజి]] ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]]తో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లాను పూర్తి చేసి, 1974 లో, [[హైదరాబాదు]] లో ప్రాక్టీస్ చేసాడు.
 
==వ్యాపారం ==
పంక్తి 48:
 
==మానవతా వాది ==
1955 లో [[ఆంధ్రప్రభ|ఆంధ్ర ప్రభ]] ఎడిటర్ [[నార్ల వెంకటేశ్వరరావు]]కు [[ఎం.ఎన్.రాయ్]] పూర్తి సాహిత్యం అందచేసి ఆయన నవ్య మానవ వాదిగా మారడానికి నరహరి కారకుడయ్యాడు. [[ఎం.ఎన్.రాయ్]] 1955 లో మరణించినప్పుడు ఆయనపై సంపాదకీయం రాయక పోగా, వార్త కూడా [[ఆంధ్రప్రభ]]లో వేయనందుకు [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] విరుచుకపడి నార్లను దుయ్యపట్టాడు. అప్పుడు నరహరిని కోరి, రాయ్ సాహిత్యం, నార్ల తెప్పించుకున్నాడు. నార్ల ఆలోచనా విధానం పై [[ఎం.ఎన్.రాయ్]] రచనలు, సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి.
 
==హేతువాది==
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు