అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''అప్పాజి పేట
అప్పాజిపేట తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాలోని నల్గొండ మండలంలో ఒక గ్రామం. పిన్ కోడ్ -508001 ఎస్.టి.డి కోడ్ -08682
ఈ గ్రామం 1856 ఎకరాల విస్తీర్ణంకలిగియుంది.నల్గొండ జిల్లాకి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో నల్గొండ నియోజక వర్గంలో ఉంది. అప్పాజిపేట గ్రామా పరిధిలో రెండు ఉప గ్రామాలు ఉన్నాయి అవి మిర్లోని గూడెం మరియు బంటుగూడెం. అప్పాజిపేట గ్రామానికి తూర్పున బుద్దారం,పడమర ఔరవాని,ఉత్తరాన దోమలపల్లి మరియు దక్షిణాన అన్నెపర్తి గ్రామాలు కలిగియున్నాయి. అప్పాజిపేట గ్రామ స్థానిక భాష తెలుగు.కొంతమంది హిందీ బాషా కూడా మాట్లాడుతారు.అప్పాజిపేటలో ఉన్న అనేక దుకాణాలు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నాయి. అప్పాజిపేట మూడు భాగాలుగా విస్తరించి ఉంది. ఎస్.సి కాలనీ, అంబేద్కర్ కాలనీ మరియు హనుమాన్ నగర్ కాలనీ. దురదుష్టవశాత్తు ఈ గ్రామంలో అభివృద్ధికి నోచుకోనివి చాల ఉన్నాయి ముఖ్యంగా మంచి నీటి సమస్య. అప్పాజిపేట లో అత్యధిక మంది హిందువులు ఉన్నప్పటికీ ముస్లింలు మరియు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు.అందరు ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి మెలసి జీవిస్తారు.
== దేవాలయాలు ==
=== శివాలయం ===
ఈ గ్రామంలో 800 ఏండ్ల పురాతన శివాలయం ఉంది. కాకతీయ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.చాల కలం ఈ గుడి పట్టించుకొకపోవడం వల్ల ఈ గుడి దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పురావస్తు శాఖ అధికారులు వచ్చి గుడిని సందర్శించి వివరాలు సేకరించారు. మహా శివరాత్రి పర్వదినాన ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చి మొక్కులను సమర్పిస్తారు ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్థానిక యువకులు గుడిని శుభ్రం చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.శివాలయం గుడి ప్రక్కనే వినాయకుడు విగ్రహం కొలువై ఉంది. ముందుగా వినాయకుడిని దర్శించిన తర్వాత ఆ మహా శివుడిని దర్శిస్తారు.ఇక్కడ ఉన్న ఒక్క చెట్టు ఇక్కడ మరియు శ్రీశైలం మాత్రమే ఉన్నట్టు పెడ్తారు చెబుతూవుంటారు.
== చారిత్రక ఆనవాళ్లు ==
=== బృహత్ శిలాయుగం ===
స్థానిక గ్రామ జర్నలిస్ట్ పిలుపు మేరకు పురావస్తు శాఖ అధికారులు విచ్చేసి మెన్ హిర్ సమాధిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సమాధి దాదాపు 20 పిట్ల ఎత్తులో ఉండటం విశేషం.ఇది దేశంలోనే అతిపెద్ద మెన్ హిర్ సమాధి అని గుర్తించారు.పురావస్తు అంతర్జాతీయ సదస్సులో ఈ సమాధి గురించి ప్రస్తావించడంతో పాటుఈ మెన్ హిర్ సమాధి చిత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు రచించిన పుస్తకంలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచరించారు.
=== సప్తమాత్రికలు ===
11,12,13వ శతాబ్దానికి సంబదించిన విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం కాకతీయుల కాలంలో దేవతా మూర్తుల విగ్రహంను సంతానం లేని మహిళలు పూజంచేవారని అని తెలుస్తుంది. ఈ విగ్రహం 3పిట్ల 6ఇంచుల పొడవు 1 పిట్ ఎత్తు కలిగివుంది. ఈ విగ్రహంలో మొదటగా వీరభద్రుడు (శివ).. చివరన వినాయక విగ్రహాలు ఉన్నాయి.మధ్యలో ఏడుగురు దేవతలు ఉన్నారు.వారిలో వరుసగా బ్రహ్మీ!!! మహేశ్వరి!!!కౌమారి!!!వైష్ణవి!!!వరాహి!!!ఇంద్రాణి!!!చాముండి దేవతలున్నారు.వారి వాహనాలు వరుసగా హంస-నంది-నెమలి-గరుత్మంతుడు-పండి-ఏనుగు-నక్క చిత్రాలు వరుసగా ఉన్నాయి.
=== బ్యాంకులు ===
# కెనరా బ్యాంకు
=== విగ్రహాలు ===
# పొట్టి శ్రీరాములు
# అంబేడ్కర్
|