కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
#శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ [[మహాశివరాత్రి]] ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి 901వ వార్షిక ప్రతిష్ఠామహోత్సవం, 2016,జనవరి-20వ తేదీ బుధవారంనాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు గణపతి యఙం వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి శాంతికళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. మహీలలు అమ్మవేఇకి కుంకుమపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]&[15]
# శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఉప్పువారివీధిలో ఉంది. ఈ ఆలయంలో 2015,జూన్-29వ తేదీనాడు, ఒక గోశాలను ప్రారంభించారు. ఇక్కడ నిత్యం గోపూజకు గోవులు అందుబాటులో ఉండును. [12]
#శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ [[వేణుగోపాలస్వామి]]<nowiki/>వారి దేవస్థానం:- ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణమాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
#శ్రీ చింతలమ్మ అమ్మవారు:- గ్రామంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్లబండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు [[పసుపు]], [[కుంకుమ]]<nowiki/>లతో నిండుబిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
#శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం:- ఇక్కడ 2015,మార్చ్-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారనామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారనామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారనామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్తబృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన [[కర్రసాము]], [[కోలాటం]] ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చ్-29 [[ఆదివారం]] నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]